త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Odisha | పోలీసుల వాహనాన్ని ఢీకొన్న ట్రక్కు.. ఐదుగురు దుర్మ‌ర‌ణం

Odisha | త్రినేత్ర‌.న్యూస్‌: ఒడిశాలోని (Odisha) ఝార్సుగూడ జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం (Road Accident) జ‌రిగింది. ఈ ప్ర‌మాదంలో ఐదుగురు పోలీసులు అక్క‌డిక‌క్క‌డే మృతిచెందారు.

G

National | Published On Feb 22, 2026, 11.48 am IST

Odisha | పోలీసుల వాహనాన్ని ఢీకొన్న ట్రక్కు.. ఐదుగురు దుర్మ‌ర‌ణం
Advertisement

Odisha | త్రినేత్ర‌.న్యూస్‌: ఒడిశాలోని (Odisha) ఝార్సుగూడ జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం (Road Accident) జ‌రిగింది. ఈ ప్ర‌మాదంలో ఐదుగురు పోలీసులు అక్క‌డిక‌క్క‌డే మృతిచెందారు. ఆదివారం తెల్లవారుజామున జాతీయ ర‌హ‌దారి 49పై ఝార్సుగూడ స‌ద‌ర్ పోలీస్ స్టేష‌న్ స‌మీపంలో పోలీసు సిబ్బంది ప్ర‌యాణిస్తున్న కారును ట్ర‌క్కు ఢీకొట్టింది. దీంతో ఐదుగురు ఘ‌ట‌నా స్థ‌లంలోనే మ‌ర‌ణించ‌గా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.

స్థానికుల స‌హాయంతో గాయ‌ప‌డిన ముగ్గురిని పోలీసులు ద‌వాఖాన‌కు త‌ర‌లించారు. వారి ప‌రిస్థితి విష‌మంగా ఉంద‌ని చెప్పారు. మ‌ర‌ణించిన వారిని ఏపీఆర్ పోలీసులు కాశీరామ్ భోయ్, దేబ్దత్ సా, డ్రిల్ సబ్ ఇన్‌స్పెక్టర్ నిరంజన్ కుజుర్, ఏపీఆర్ హవల్దార్ లింగరాజ్ ధురువా, హోంగార్డు భక్తబంధు మిర్ధాగా గుర్తించారు. ఇద్దరు ఏపీఆర్ పోలీసులు, ఒక సార్జెంట్ తీవ్రంగా గాయపడ్డారని చెప్పారు. వారంతా రంగాలి ప్రాంతంలో పోలీస్ కానిస్టేబుల్ వివాహానికి వెళ్లి వ‌స్తుండ‌గా ప్ర‌మాదం జ‌రిగింద‌న్నారు. ప్ర‌మాదానికి కార‌ణ‌మైన ట్ర‌క్కు డ్రైవ‌ర్‌ను అరెస్టు చేశామ‌ని, వాహ‌నాన్ని సీజ్ చేశామ‌ని తెలిపారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదుచేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement