త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kerala Blast | కేర‌ళ‌లో భారీ పేలుడు.. ఎనిమిది మంది దుర్మ‌ర‌ణం.. ఉత్స‌వాల్లో విషాదం..

Kerala Blast | కేర‌ళ త్రిస్సూర్ జిల్లాలో మంగ‌ళ‌వారం భారీ పేలుడు సంభ‌వించింది. ఈ ఘటనలో కనీసం ఎనిమిది మంది మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. ఇందులో ప‌లువురి ప‌రిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. త్రిస్సూర్ పూరం ఉత్సవాల ఏర్పాట్లు జరుగుతున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

P

National | Published On Apr 21, 2026, 6.58 pm IST

Kerala Blast | కేర‌ళ‌లో భారీ పేలుడు.. ఎనిమిది మంది దుర్మ‌ర‌ణం.. ఉత్స‌వాల్లో విషాదం..
Advertisement

Kerala Blast | కేర‌ళ త్రిస్సూర్ జిల్లాలో మంగ‌ళ‌వారం భారీ పేలుడు సంభ‌వించింది. ఈ ఘటనలో కనీసం ఎనిమిది మంది మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. ఇందులో ప‌లువురి ప‌రిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. త్రిస్సూర్ పూరం ఉత్సవాల ఏర్పాట్లు జరుగుతున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పేలుడు సంభవించిన సమయంలో ఫైర్‌క్రాకర్ తయారీ యూనిట్‌లో సుమారు 40 మంది కార్మికులు పనిచేస్తున్నట్లు అధికారులు తెలిపారు. నిర్వాహకులు కార్మికులకు భోజనం తీసుకువచ్చిన సమయానికే ఈ ఘటన జరిగినట్లు సమాచారం. ఈ ప్రమాదం నుంచి ఏడుగురు బయటపడినట్లు అధికారులు పేర్కొన్నారు.

పూరం ఉత్సవాల్లో భాగంగా తిరువంబాడి వర్గానికి సంబంధించిన బాణాసంచా మోడ‌ల్‌ను సిద్ధం చేస్తున్న యూనిట్‌లో ఈ పేలుడు సంభవించినట్లు తెలుస్తోంది. భారీగా నిల్వ ఉంచిన పేలుడు పదార్థాలకు మంటలు అంటుకుని అనంతరం భారీ పేలుడు జరిగినట్లు ప్రాథమిక సమాచారం. పేలుడు తీవ్రత ఎక్కువగా ఉండడంతో శబ్దం పలు కిలోమీటర్ల దూరం వరకూ వినిపించింది. ఘటన అనంతరం ప్రాంతమంతా దట్టమైన పొగ, మంటలు వ్యాపించాయి. దాంతో సహాయక చర్యలకు అంతరాయం కలిగింది. స‌గం కాలిన, పేలని పేలుడు పదార్థాలు ఉండటంతో రక్షణ చర్యలు కష్టతరంగా మారాయి. ఘటన స్థలానికి వెంటనే అంబులెన్సులు చేరుకుని గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు త‌ర‌లించారు.

త్రిస్సూర్ మెడికల్ కాలేజీ సహా పరిసర ఆసుపత్రులను అప్రమత్తం చేశారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేశారు. ప్రభుత్వానికి చెందిన కే ఐ ఎల్ ఏ (KILA) సిబ్బంది భారీ శబ్దం విని మొదట భూకంపంగా భావించారు. ఆ త‌ర్వాత బయటకు వచ్చి పరిశీలించగా అది పేలుడు అని గుర్తించినట్లు అధికారులు తెలిపారు. పూరం ఉత్సవం అధికారికంగా జెండా ఆవిష్కరణతో ప్రారంభమైన మరుసటి రోజే ఈ ఘటన జరగడం ఆందోళన కలిగిస్తోంది.

ప్రమాదానికి ఖచ్చితమైన కారణం ఇంకా తెలియరాలేదు. అయితే, భద్రతా ప్రమాణాల లోపం, పేలుడు పదార్థాల నిల్వ, నిర్వహణలో నిర్లక్ష్యం కారణంగా ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. ఘటనతో పరిసర ప్రాంతాల్లో భయాందోళనలు నెలకొన్నాయి. కొంతసేపు సాధారణ జ‌న‌జీవ‌నానికి ఇబ్బంది క‌లిగింది. అధికారులు ఆ ప్రాంతాన్ని త‌మ అధీనంలోకి తీసుకొని.. ఎవ‌రూ అటువైపుగా వెళ్ల‌కుండా చ‌ర్య‌లు తీసుకున్నారు. సంఘ‌ట‌నా స్థ‌లంలో ఉన్న‌తాధికారులు ప‌రిస్థితిని ప‌ర్య‌వేక్షిస్తున్నారు. ఘ‌ట‌న‌పై ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ స్పందించారు. మృతుల కుటుంబాల‌కు సంతాపం ప్ర‌క‌టించారు.

Advertisement
Advertisement