త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Today’s Chanakya Exit Polls | టుడేస్ చాణక్య ఎగ్జిట్ పోల్స్ వచ్చేశాయ్.. బెంగాల్ ఓటర్లు ఎవరికి పట్టం కట్టారంటే?

నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి. తమిళనాడులో స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే మళ్లీ అధికారం నిలబెట్టుకోనుండగా, దళపతి విజయ్ పార్టీ టీవీకే (TVK) ఏకంగా 63 సీట్లతో సంచలనం సృష్టిస్తుందని 'టుడేస్ చాణక్య' సర్వే అంచనా వేసింది. ఇక పశ్చిమ బెంగాల్, అస్సాంలో బీజేపీ భారీ విజయం సాధించనుందని స్పష్టం చేసింది.

J

National | Published On Apr 30, 2026, 7.50 pm IST

Today’s Chanakya Exit Polls | టుడేస్ చాణక్య ఎగ్జిట్ పోల్స్ వచ్చేశాయ్.. బెంగాల్ ఓటర్లు ఎవరికి పట్టం కట్టారంటే?
Advertisement

Today's Chanakya Exit Polls | త్రినేత్ర.న్యూస్ : ఏప్రిల్ నెలలో జరిగిన అస్సాం, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఘట్టం ముగిసింది. మే 4వ తేదీన ఓట్ల లెక్కింపు జరిగి అసలు ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో ప్రముఖ సర్వే సంస్థ 'టుడేస్ చాణక్య' (Today's Chanakya) రాష్ట్రాల వారీగా తమ ఎగ్జిట్ పోల్ (Exit Polls) అంచనాలను విడుదల చేసింది. ఈ సర్వేలో పలు ఆసక్తికర, సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

తమిళనాడు (మొత్తం స్థానాలు - 234): విజయ్ సంచలనం

తమిళ రాజకీయాల్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన స్టార్ హీరో దళపతి విజయ్ పార్టీ 'తమిళగ వెట్రి కళగం' (TVK) తొలి ఎన్నికల్లోనే సత్తా చాటబోతోందని సర్వే తెలిపింది. డీఎంకే కూటమి మళ్లీ అధికారాన్ని నిలబెట్టుకోనుండగా.. విజయ్ పార్టీ ఏకంగా 63 సీట్లు గెలుచుకుని బలమైన ప్రతిపక్షంగా అవతరించనుందని అంచనా వేసింది.

డీఎంకే కూటమి (DMK+): 125 ± 11 సీట్లు (39% ఓట్ షేర్)

టీవీకే (TVK): 63 ± 11 సీట్లు (30% ఓట్ షేర్)

అన్నాడీఎంకే కూటమి (AIADMK+): 45 ± 11 సీట్లు (27% ఓట్ షేర్)

పశ్చిమ బెంగాల్: దీదీకి షాక్.. కమలవికాసం!

ఈ ఎన్నికలు ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి భారీ ఎదురుదెబ్బ అని చాణక్య అంచనా వేసింది. బెంగాల్‌లో బీజేపీ సునామీ సృష్టించబోతోందని, సగానికి పైగా సీట్లు కైవసం చేసుకుంటుందని స్పష్టం చేసింది.

బీజేపీ (BJP): 192 ± 11 సీట్లు (48% ఓట్ షేర్)

టీఎంసీ కూటమి (TMC+): 100 ± 11 సీట్లు (38% ఓట్ షేర్)

మమతా బెనర్జీ కౌంటర్: ఎగ్జిట్ పోల్స్ అంచనాలపై దీదీ తీవ్రంగా స్పందించారు. "ఈ ఎగ్జిట్ పోల్స్ నమ్మకండి. ప్రజలు ఇచ్చిన తీర్పుపై నాకు పూర్తి నమ్మకం ఉంది. మేం కచ్చితంగా 226కు పైగా సీట్లు గెలుస్తాం" అని మమత ధీమా వ్యక్తం చేశారు.

అస్సాం: బీజేపీదే క్లీన్ స్వీప్

అస్సాంలో ఎన్డీయే (NDA) కూటమి తన ఆధిపత్యాన్ని కొనసాగించనుంది. ఏకంగా 50 శాతానికి పైగా ఓట్ షేర్‌తో భారీ మెజారిటీ దిశగా దూసుకుపోతోందని సర్వే తేల్చింది.

బీజేపీ కూటమి (BJP+): 102 ± 9 సీట్లు

కాంగ్రెస్ కూటమి (Cong+): 23 ± 9 సీట్లు

కేరళ: హోరాహోరీ పోరు.. యూడీఎఫ్‌కు మొగ్గు

కేరళలో మళ్లీ పాత రాజకీయ సంప్రదాయం (ఒకసారి ఎల్‌డీఎఫ్, మరోసారి యూడీఎఫ్) తెరపైకి రానుంది. ఇక్కడ అధికార ఎల్‌డీఎఫ్ (LDF) కు చెక్ పెడుతూ.. కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ (UDF) స్వల్ప ఆధిక్యంతో అధికారాన్ని చేపట్టే అవకాశం ఉందని చాణక్య సర్వే తెలిపింది. ఇక్కడ బీజేపీ తన బలాన్ని పెంచుకోవడం విశేషం.

యూడీఎఫ్ (UDF): 69 ± 9 సీట్లు (40% ఓట్ షేర్)

ఎల్‌డీఎఫ్ (LDF): 64 ± 9 సీట్లు (38% ఓట్ షేర్)

బీజేపీ కూటమి (BJP+): 7 ± 4 సీట్లు (20% ఓట్ షేర్)

మే 4వ తేదీన ఈవీఎంలు తెరుచుకున్న తర్వాత ఈ అంచనాలు ఎంతవరకు నిజమవుతాయో వేచి చూడాలి.

Advertisement
Advertisement