West Bengal | బెంగాల్లో మరోసారి రీ పోలింగ్.. ఫాల్తా నియోజకవర్గంలో ఎన్నిక రద్దు
West Bengal | పశ్చిమ బెంగాల్లో (West Bengal) మరోసారి రీ పోలింగ్ (Re Polling) జరగనుంది. దక్షిణ 24 పరగణాల జిల్లాలో ఉన్న ఫాల్తా అసెంబ్లీ నియోజకవర్గంలోని (Falta Assembly Constituency) మొత్తం 285 పోలింగ్ కేంద్రాల్లో మరోసారి పోలింగ్ నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం (ECI) నిర్ణయించింది.
West Bengal | త్రినేత్ర.న్యూస్: పశ్చిమ బెంగాల్లో (West Bengal) మరోసారి రీ పోలింగ్ (Re Polling) జరగనుంది. దక్షిణ 24 పరగణాల జిల్లాలో ఉన్న ఫాల్తా అసెంబ్లీ నియోజకవర్గంలోని (Falta Assembly Constituency) మొత్తం 285 పోలింగ్ కేంద్రాల్లో మరోసారి పోలింగ్ నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం (ECI) నిర్ణయించింది. రెండో విడతలో భాగంగా ఏప్రిల్ 29న అక్కడ పోలింగ్ జరిగింది. ఈ సందర్భంగా తీవ్రమైన ఎన్నికల ఉల్లంఘనలు, ప్రజాస్వామ్య ప్రక్రియను దెబ్బతీసే చర్యలు జరిగాయని నిర్ధారించిన ఈసీ.. ఎన్నికను రద్దు చేసింది. మే 21న నియోజకవర్గంలోని 258 పోలింగ్ కేంద్రాలలో మళ్లీ పోలింగ్ నిర్వహించాలని ఆదేశించింది. ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఈ నెల 24న ఓట్లు లెక్కిస్తామని ఈసీ తెలిపింది.
ఫాల్తా నియోజకవర్గంలో ఓటర్లను బెదిరించడం, ఈవీఎంలో బీజేపీ గుర్తు కనపడకుండా స్టికర్ వేయడం, అనధికార వ్యక్తులు పోలింగ్ బూత్లలోకి వచ్చారనే ఆరోపణలు వచ్చాయి. శనివారం ప్రజలు పెద్ద ఎత్తున వీధుల్లోకి వచ్చి ఇటీవలి ఎన్నిక సందర్భంగా టీఎంసీ వర్గాలు తమను బెదిరించాయని, స్వేచ్ఛగా ఓటు వేయనీయలేదని ఆరోపించారు. ఈ ఫిర్యాదుల నేపథ్యంలో క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఈసీ.. రీపోలింగ్ నిర్వహించాలని నిర్ణయించింది.
కాగా, రెండో విడతలోనే అక్రమాలు జరిగాయన్న కారణంతో దక్షిణ 24 పరగణాల జిల్లాలోని మగ్రాహాట్ పశ్చిమ్ (11 బూత్లు), డైమండ్ హార్బర్ (4 బూత్లు) అసెంబ్లీ స్థానాల్లోని పలు బూత్ల్లో శనివారం (మే 2న) రీ పోలింగ్ నిర్వహించారు.
సంబంధిత వార్తలు

Vande Mataram | ఇక మదర్సాల్లోనూ వందేమాతరం తప్పనిసరి.. బెంగాల్ సర్కార్ కీలక నిర్ణయం
మే 21, 2026

R. G. Kar Medical College | సందీప్ ఘోష్ ప్రాసిక్యూషన్కు అనుమతి.. ఆర్జీకర్ కేసులో బిగుస్తున్న ఉచ్చు
మే 19, 2026

West Bengal Annapurna Scheme | బెంగాల్ సర్కార్ భారీ నజరానా: మహిళలకు నెలకు రూ.3000, ఉచిత బస్సు ప్రయాణం!
మే 18, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



