త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Earthquake | వినుకొండ‌లో అర్ధ‌రాత్రి భూకంపం.. ఇండ్లలో నుంచి జ‌నం ప‌రుగులు

Earthquake | ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని ప‌ల్నాడు జిల్లా వినుకొండలో (Vinukonda) స్వ‌ల్ప భూకంపం (Earthquake) వ‌చ్చింది. గురువారం తెల్ల‌వారుజామున 2 గంట‌ల స‌మయంలో భూమి కంపించింది.

G

National | Published On Feb 19, 2026, 9.25 am IST

Earthquake | వినుకొండ‌లో అర్ధ‌రాత్రి భూకంపం.. ఇండ్లలో నుంచి జ‌నం ప‌రుగులు
Advertisement

Earthquake | త్రినేత్ర‌.న్యూస్‌: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని ప‌ల్నాడు జిల్లా వినుకొండలో (Vinukonda) స్వ‌ల్ప భూకంపం (Earthquake) వ‌చ్చింది. గురువారం తెల్ల‌వారుజామున 2 గంట‌ల స‌మయంలో వినుకొండ‌లో 2 సెక‌న్ల‌పాటు భూమి కంపించింది. న‌డిగ‌డ్డ‌, దర్శి ప‌రిస‌ర ప్రాంతాల్లో ప్రకంపనలు వ‌చ్చాయ‌ని అధికారులు చెప్పారు.

క్టర్ స్కేల్‌పై భూకంప‌ తీవ్రత 3.5గా నమోద‌యింద‌ని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (NCS) వెల్లడించింది. భూకంప కేంద్రం వినుకొండకు వాయవ్య దిశలో 20 కిలోమీటర్ల దూరంలో, భూ అంతర్భాగంలో 10 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు పేర్కొంది. కాగా, మంచి నిద్ర‌లో ఉన్న‌ స‌మ‌యంలో భూకంపం రావ‌డంతో జ‌నం భ‌యాందోళ‌న‌ల‌కు గుర‌య్యారు. ఏం జ‌రుగుతుందో తెలియ‌క ఇండ్ల‌లో నుంచి రోడ్ల‌పైకి ప‌రుగులు తీశారు. భూ ప్రకంపనల వల్ల ఎటువంటి ఆస్తి, ప్రాణ జరగలేదని అధికారులు తెలిపారు.

https://x.com/NCS_Earthquake/status/2024233009143279975/photo/1

Advertisement
Advertisement