త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Bitter Gourd | కాక‌రకాయ కూర వండింద‌ని.. క‌న్న‌ త‌ల్లిని కొట్టి చంపాడు..

G

National | Published On Feb 21, 2026, 6.47 am IST

Bitter Gourd | కాక‌రకాయ కూర వండింద‌ని.. క‌న్న‌ త‌ల్లిని కొట్టి చంపాడు..
Advertisement

త్రినేత్ర‌.న్యూస్‌: కాక‌ర‌కాయ కూర (Bitter Gourd) ఓ త‌ల్లి ప్రాణాలు పోయేలా చేసింది. పూటుగా తాగొచ్చిన (Alcohol Addicted) కొడుకు.. కాక‌ర కాయ కూర వండింద‌ని త‌ల్లితో గొడ‌వ‌ప‌డ్డాడు. తాగిన మైకంలో ఇష్టం వ‌చ్చిన‌ట్లు కొట్ట‌డంతో ఆమె అక్క‌డిక‌క్క‌డే మృతిచెందిన ఘ‌ట‌న మ‌హారాష్ట్ర‌లోని (Maharashtra) చంద్రాపూర్ జిల్లాలో చోటుచేసుకున్న‌ది.

చంద్రాపూర్ (Chandrapur) జిల్లా డోంగ‌ర్‌గావ్ కు చెందిన సుమిత్రా పెట్కూలె (65), జ‌గ‌దీశ్ పెట్కూలె (37) త‌ల్లీకొడుకులు. జ‌గ‌దీశ్‌కు వివాహం అయిన‌ప్ప‌టికీ భార్య అత‌నికి దూరంగా ఉంటున్న‌ది. మ‌ద్యానికి బానిసైన అత‌డు రోజూ తాగివ‌చ్చి గొడ‌వ ప‌డుతుంటంతో రెండు నెల‌ల క్రిత‌మే ఆమె ఇంటి నుంచి వెళ్లిపోయింది. దీంతో త‌ల్లీ కొడుకులు ఇద్ద‌రే ఉంటున్నారు.

కాగా, గ‌త రాత్రి పూటుగా తాగి వ‌చ్చిన జ‌గ‌దీశ్.. సుమిత్ర‌ను అన్నం పెట్టమ‌ని అడిగాడు. దీంతో ఆమె అన్నంతోపాటు కాక‌ర కాయ కూర‌ వ‌డ్డించింది. దీంతో కాక‌ర‌కాయ ఎందుకు వండావ‌ని త‌ల్లితో వాగ్వాదానికి దిగాడు. అదికాస్త పెద్ద‌దికావ‌డంతో ఇద్ద‌రిమ‌ధ్య గొడ‌వ‌కు దారితీసింది. ఆగ్ర‌హంతో సుమిత్ర‌పై పిడిగుద్దులతో విరుచుకుప‌డ్డాడు. దీంతో ఆమె అక్క‌డిక‌క్క‌డే మృతిచెందింది.

అనంత‌రం ఊర్లో తిరుగుతూ తాను త‌న త‌ల్లిని చంపేశాన‌ని అంద‌రికి చెప్పాడు. అయితే మ‌ద్యం మ‌త్తులో ఉండ‌టంతో ప్ర‌జ‌లు జ‌గ‌దీశ్ మాట‌లు న‌మ్మ‌లేదు. అయితే ప‌లువురు అనుమానంతో పోలీసుల‌కు స‌మాచారం అందించారు. దీంతో ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్న పోలీసులు.. సుమిత్ర మృత‌దేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. జ‌గ‌దీశ్‌ను అరెస్టు చేశారు. ఈఘ‌ట‌న‌పై కేసు న‌మోదుచేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement