త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

leech | వ్య‌క్తి గొంతులో ఇరుక్కుపోయిన బ‌తికున్న జ‌ల‌గ‌.. వైద్యులు ఎలా బ‌య‌ట‌కు తీశారంటే..?

leech | జ‌ల‌గ (leech).. దీన్ని చూస్తేనే ఒళ్ళు జలదరిస్తుంది. ఇది మ‌నిషి ర‌క్తాన్ని పీలుస్తుంది. అలాంటిది ఈ ప్ర‌మాద‌క‌ర‌మైన జ‌ల‌గ మ‌నిషి గొంతులోకి ప్ర‌వేశిస్తే.. త‌ల‌చుకుంటేనే ఒంట్లో వ‌ణ‌కుపుడుతోంది క‌దూ.

D

National | Published On Feb 3, 2026, 10.22 am IST

leech | వ్య‌క్తి గొంతులో ఇరుక్కుపోయిన బ‌తికున్న జ‌ల‌గ‌.. వైద్యులు ఎలా బ‌య‌ట‌కు తీశారంటే..?
Advertisement

leech | జ‌ల‌గ (leech).. దీన్ని చూస్తేనే ఒళ్ళు జలదరిస్తుంది. ఇది మ‌నిషి ర‌క్తాన్ని పీలుస్తుంది. అలాంటిది ఈ ప్ర‌మాద‌క‌ర‌మైన జ‌ల‌గ మ‌నిషి గొంతులోకి ప్ర‌వేశిస్తే.. త‌ల‌చుకుంటేనే ఒంట్లో వ‌ణ‌కుపుడుతోంది క‌దూ. అయితే, ఓ వ్య‌క్తికి ఇలాంటి అనుభ‌వ‌మే ఎదురైంది మ‌రి. 55 ఏళ్ల వ్య‌క్తి గొంతులో ఓ బ‌తికున్న జ‌ల‌గ ఇరుక్కుపోయింది. ఈ ఘ‌ట‌న హిమాచ‌ల్ ప్ర‌దేశ్ రాష్ట్రం సిమ్లాలో చోటు చేసుకుంది.

సిర్మౌర్ (Sirmaur) జిల్లా పచ్చాడ్ నియోజకవర్గంలోని కంగేర్ ధర్యార్ గ్రామానికి చెందిన 55 ఏళ్ల సురేశ్ కుమార్ (Suresh Kumar).. ప‌నిప్ర‌దేశంలో దొరికే నీటిని తాగాడు. అయితే, ఆ నీటిలో జ‌ల‌గ ఉండ‌టాన్ని అత‌డు గ‌మ‌నించ‌లేదు. దీంతో నీటితోపాటూ అది కూడా గొంతులోకి వెళ్లి అక్క‌డ ఇరుక్కుపోయింది. ఈ విష‌యం అత‌డికి కూడా తెలియ‌దు. గొంతులో ఏదో అడ్డుప‌డిన‌ట్లు అనిపించ‌డంతో తీవ్ర అసౌక‌ర్యానికి గుర‌య్యాడు. కాసేప‌టికి శ్వాస తీసుకోవ‌డానికి కూడా ఇబ్బందిగా మారింది. దీంతో అత‌డు సోల‌న్ (Solan)లోని ఎంఎంయూ ఆసుప‌త్రికి వెళ్లాడు. అక్క‌డ ప‌రీక్షించిన వైద్యులు అత‌డి గొంతులో ఏదో క‌దులుతున్నట్లు గుర్తించారు. సిమ్లా (Shimla)లోని ఇందిరా గాంధీ వైద్య క‌ళాశాల‌కు వెళ్లాల‌ని సూచించారు.

అక్క‌డ డాక్ట‌ర్ డింపుల్ బృందం సురేశ్ గొంతును ప‌రీక్షించింది. బ్రాంకోస్కోపీ నిర్వహించగా.. అత‌డి గొంతులో బ‌తికున్న జ‌ల‌గ ఉన్న‌ట్లు తేలింది. దీంతో దాన్ని తొల‌గించేందుకు వైద్య బృందం తీవ్రంగా క‌ష్ట‌ప‌డింది. దాన్ని డైరెక్ట్‌గా తొల‌గించ‌డం అసాధ్యం. ఏ చిన్న తేడా వ‌చ్చిన అది శ‌రీరంలోకి వెళ్లిపోయే ప్ర‌మాదం ఉంది. దీంతో వైద్య బృందం వినూత్న పద్ధతిని అనుసరించింది. వాక్యూమ్ పరికరాన్ని ఉపయోగించి.. కేవలం 20 నిమిషాల వ్యవధిలో ఆ జలగను స‌జీవంగా బయటకు తీసింది. అనంత‌రం కొన్ని పరీక్షల తర్వాత రోగిని డిశ్చార్జ్ చేశారు. ప్ర‌స్తుతం అత‌ను ఆరోగ్యంగానే ఉన్న‌ట్లు వైద్యులు తెలిపారు.

Advertisement
Advertisement