త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Dense Fog | వణుకుతున్న ఉత్తర భారతం.. ఢిల్లీ అతలాకుతలం.. విమాన సర్వీసులు రద్దు

జమ్ముకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ లాంటి రాష్ట్రాల్లో ఈ పొగమంచు కారణంగా భారీగా హిమపాతాలు కురుస్తున్నాయి. దీని వల్ల ఆయా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు మైనస్ డిగ్రీలకు చేరుకున్నాయి.

J

National | Published On Dec 19, 2025, 2.06 pm IST

Dense Fog | వణుకుతున్న ఉత్తర భారతం.. ఢిల్లీ అతలాకుతలం.. విమాన సర్వీసులు రద్దు
Advertisement

Dense Fog | ఉత్తర భారతం తీవ్రమైన చలితో వణుకుతున్నది. దట్టమైన పొగమంచు వల్ల జనజీవనం స్తంభించిపోయింది. ముఖ్యంగా ఢిల్లీ అయితే దట్టమైన పొగమంచుతో అతలాకుతలం అవుతోంది. దీంతో భారత వాతావరణ శాఖ ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాలకు రెడ్, ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఢిల్లీలో తీవ్రమైన పొగమంచు కారణంగా విమాన సర్వీసులు స్తంభించిపోయాయి. పలు రైళ్లు కూడా ఆలస్యంగా నడుస్తున్నాయి. రోడ్డు కనిపించక వాహనదారులు బయటికి రావడమే మానేశారు. ఢిల్లీ చుట్టుపక్కన ఉన్న పంజాబ్, హర్యానా, చండీగఢ్‌లోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోంది.

150 విమాన సర్వీసులు రద్దు

దట్టమైన పొగమంచు కారణంగా ఢిల్లీ నుంచి బయలు దేరాల్సిన 150 కి పైగా విమనాలను అధికారులు నిలిపివేశారు. మరికొన్ని విమానాలు బయలుదేరే సమయం కంటే లేట్‌గా బయలుదేరుతున్నాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

అనవసర ప్రయాణాలు మానుకోండి

ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లో రాబోయే రోజుల్లో అత్యంత తీవ్రమైన చలిగాలులు వీస్తాయని హెచ్చరించింది. జమ్ముకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ లాంటి రాష్ట్రాల్లో ఈ పొగమంచు కారణంగా భారీగా హిమపాతాలు కురుస్తున్నాయి. దీని వల్ల ఆయా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు మైనస్ డిగ్రీలకు చేరుకున్నాయి. రోడ్లపై కూడా మంచు వర్షం కురుస్తుండటంతో రోడ్లన్నీ బ్లాక్ అయి వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. అందుకే ప్రయాణికులు ఈ సమయంలో ఎక్కడికీ ప్రయాణాలు పెట్టుకోకూడదని, అత్యవసరం అయితే తప్ప ఇంట్లో నుంచి బయటికి రావద్దని ఐఎండీ హెచ్చరిస్తోంది.

Advertisement

తాజావార్తలు

Advertisement