త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CPI Narayana | తిరుమ‌ల శ్రీవారిని ద‌ర్శించుకున్న సీపీఐ నారాయ‌ణ‌.. ల‌డ్డూ వివాదంపై ఏమ‌న్నారంటే?

CPI Narayana | త్రినేత్ర‌.న్యూస్‌: క‌మ్యూనిస్ట్ నాయ‌కులూ భ‌క్తి బాట‌ప‌డుతున్నారు. సీపీఐ జాతీయ నేత నారాయ‌ణ (CPI Narayana) తిరుమ‌ల (Tirumla) శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామివారిని ద‌ర్శించుకున్నారు.

G

National | Published On Feb 12, 2026, 12.30 pm IST

CPI Narayana | తిరుమ‌ల శ్రీవారిని ద‌ర్శించుకున్న సీపీఐ నారాయ‌ణ‌.. ల‌డ్డూ వివాదంపై ఏమ‌న్నారంటే?
Advertisement

CPI Narayana | త్రినేత్ర‌.న్యూస్‌: క‌మ్యూనిస్ట్ నాయ‌కులూ భ‌క్తి బాట‌ప‌డుతున్నారు. సీపీఐ జాతీయ నేత నారాయ‌ణ (CPI Narayana) తిరుమ‌ల (Tirumla) శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామివారిని ద‌ర్శించుకున్నారు. ఆల‌యం వెలుప‌ల గ్రూప్ ఫొటోకి పోజులిచ్చారు.

అనంత‌రం మీడియాతో మాట్లాడుతూ.. తిరుపతి లడ్డు వివాదంపై రాజకీయ నాయకులు నోరు అదుపులో పెట్టుకోవాలన్నారు. దేవుడిని అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేయడం సరికాదని హిత‌వు ప‌లికారు. తప్పు చేసిన అధికారులను, పాత ఈవోను వదల కూడ‌ద‌ని చెప్పారు. రాజకీయ లబ్ధి కోసమే అధికార పార్టీ లడ్డుపై రాద్ధాంతం చేస్తున్న‌ద‌ని మండిప‌డ్డారు.

మీ రాజకీయాల కోసం కోట్లాది మంది భక్తులను మనోవేదనకు గురి చేయొద్దని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ల‌డ్డూ వ్య‌వ‌హారంపై సుప్రీంకోర్టు విచారణ జరుపుతున్న‌ద‌ని, అందువ‌ల్ల‌ రాజకీయ నేతలు ఆ అంశంపై మాట్లాడటం ఆపేయాల‌ని సూచించారు. మీ రాజకీయాల కోసం కావాలంటే కొట్టుకోండి.. కానీ దేవుడిని మాత్రం లాగొద్దన్నారు. లడ్డు వివాదంపై అనవసర చర్చలు ఆపి, భక్తుల మనోభావాలను కాపాడాల‌ని సూచించారు.

Advertisement
Advertisement