త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Election Results 2026 | రేపే ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు.. ఉదయం 8 నుండి కౌంటింగ్.. బెంగాల్, తమిళనాడుపైనే అందరి కళ్లు

దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రేపు వెలువడనున్నాయి. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అసోం, పుదుచ్చేరిలలో ఉదయం 8 గంటల నుండి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. మేఖ్లిగంజ్ సహా అన్ని ప్రధాన కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.

J

National | Published On May 3, 2026, 8.09 pm IST

Election Results 2026 | రేపే ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు.. ఉదయం 8 నుండి కౌంటింగ్.. బెంగాల్, తమిళనాడుపైనే అందరి కళ్లు
Advertisement

త్రినేత్ర.న్యూస్ : ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు రేపు మే 4, 2026న వెలువడనున్నాయి. ఈనేపథ్యంలో దేశమంతటా ఆసక్తి నెలకొన్నది. సోమవారం ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపుతో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఉదయం 8.30 నుంచి ఈవీఎంల లెక్కింపు ప్రారంభమవుతుంది. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాల ఫలితాలపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా బెంగాల్‌లో అధికార పార్టీ, ప్రతిపక్షాల మధ్య హోరాహోరీ పోరు కొనసాగుతోంది. కేరళ, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాల్లో కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ ఏర్పాట్లు చేశారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కేంద్ర బలగాలతో మూడంచెల భద్రతను ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది.

Counting for 5 States Assembly Elections Starts Tomorrow at 8 AM High Security at Centers

పశ్చిమ బెంగాల్‌లో 77 కౌంటింగ్ కేంద్రాలు, తమిళనాడులో 62, కేరళలో 43, అస్సాంలో 40, పుదుచ్చేరిలో 6 కౌంటింగ్ కేంద్రాలను ఎన్నికల అధికారులు ఏర్పాటు చేశారు.

Counting for 5 States Assembly Elections Starts Tomorrow at 8 AM High Security at Centers

Advertisement
Advertisement