త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CJP | హిందుత్వ కార్య‌క‌ర్త‌ను అరెస్ట్ చేయాలి.. సీజేపీ ఆందోళ‌న‌

CJP | హిందుత్వ కార్య‌క‌ర్త‌ను అరెస్టు చేయాల‌ని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జ‌న‌తా పార్టీ కార్య‌క‌ర్త‌లు శుక్ర‌వారం పార్ల‌మెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేష‌న్ వ‌ర‌కు మార్చ్ నిర్వ‌హించారు. ఠాణా ఎదురుగా ఢిల్లీ పోలీసుల‌కు వ్య‌తిరేకంగా నినాదాలు చేశారు.

P

National | Published On Sep 4, 2026, 1.53 pm IST

CJP | హిందుత్వ కార్య‌క‌ర్త‌ను అరెస్ట్ చేయాలి.. సీజేపీ ఆందోళ‌న‌
Advertisement

CJP | హిందుత్వ కార్య‌క‌ర్త‌ను అరెస్టు చేయాల‌ని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జ‌న‌తా పార్టీ కార్య‌క‌ర్త‌లు శుక్ర‌వారం పార్ల‌మెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేష‌న్ వ‌ర‌కు మార్చ్ నిర్వ‌హించారు. ఠాణా ఎదురుగా ఢిల్లీ పోలీసుల‌కు వ్య‌తిరేకంగా నినాదాలు చేశారు. జంతర్‌మంతర్‌ వద్ద జులై 20న జరిగిన ఆందోళనలో పాల్గొన్న విద్యార్థిని తండ్రి సంజ‌య్ కుమార్‌పై దాడి చేశాడ‌ని ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న హిందుత్వ కార్య‌క‌ర్త భ‌ర‌ద్వాజ్‌ను అరెస్టు చేయ‌డంతో పాటు క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేశారు. సీజేపీ అధికార ప్ర‌తినిధి సౌర‌వ్ దాస్‌, కోక‌న్వీన‌ర్ ఆశుతోష్ రంకాతో పాటు ప‌లువురు కార్య‌క‌ర్త‌లు ఈ ఆందోళ‌న‌లో పాల్గొన్నారు. జులై 20న జరిగిన ఘటనకు సంబంధించి భ‌ర‌ద్వాజ్ ఇంట‌ర్వ్యూ వీడియో ఒక‌టి నెట్టింట వైర‌ల్ కావ‌డంతో సీజేపీ ఆందోళ‌న‌కు దిగింది.

ఆ ఇంటర్వ్యూలో సంజయ్‌కుమార్‌పై దాడి చేసినట్లుగా భ‌ర‌ద్వాజ్ చెప్పిన‌ట్లు సీజేపీ ఆరోపించింది. ఘటన తర్వాత తాను అరెస్టు కాలేదని, రాత్రంతా బయటే తిరిగానని అత‌ను చెప్పినట్లు పేర్కొంది. సంజయ్‌కుమార్‌పై దాడి అనంతరం హత్యాయత్నం సెక్షన్‌తో పాటు ఎస్సీ, ఎస్టీ చట్టంలోని నిబంధనలను వర్తింపజేయాలని పోలీసులను కోరినట్లు సౌరవ్‌ దాస్‌ తెలిపారు. పోలీసులు త‌మ విజ్ఞ‌ప్తిని పట్టించుకోలేదని ఆరోపించారు. తీవ్ర గాయాలకు సంబంధించిన సెక్షన్‌ను చేర్చాలని కోరగా.. కోర్టును ఆశ్రయించి ఆదేశాలు తీసుకురావాలని పోలీసులు చెప్పినట్లు పేర్కొన్నారు. ఆందోళనలో ఓ విద్యార్థిని మొద‌టి నుంచి త‌మ నిర‌స‌న కార్య‌క్ర‌మాల్లో భాగ‌మైంద‌ని.. ఆమె తండ్రి సంజ‌య్‌కుమార్ సైతం ఆమెతో క‌లిసి వ‌చ్చేవార‌ని దాస్ తెలిపారు.


జులై 20న కొందరు వ్యక్తులు నిరసన ప్రదేశంలోకి ప్రవేశించడంతో ఘర్షణ చోటుచేసుకుందని, ఆ సమయంలో సంజయ్‌కుమార్‌పై దాడి జరిగిందని ఆరోపించారు. ఘటనలో పాల్గొన్న ఇతరులను గుర్తించి అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. అయితే, సంజయ్‌కుమార్‌ పుర్రెకు పగులు ఏర్పడినట్లు వచ్చిన ఆరోపణలను ఢిల్లీ పోలీసులు ఖండించారు. ఘర్షణలో ఆయనకు స్వల్ప గాయమైందని తెలిపారు. సంజయ్‌కుమార్‌ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. సీజేపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పోలీస్‌స్టేషన్‌ వద్దకు చేరుకోవడంతో అక్కడ భద్రతను కట్టుదిట్టం చేశారు. అదనపు బలగాలను మోహరించి బారికేడ్లు ఏర్పాటు చేశారు.

Advertisement
Advertisement