త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kya Bolti Public Tour | క్యా బోల్తీ పబ్లిక్ : విద్యా వ్యవస్థలో సంస్కరణలు, నిరుద్యోగ సమస్యలపై అభిజీత్ డిప్కే దేశవ్యాప్త పర్యటన

విద్యా వ్యవస్థలో మార్పులు, నిరుద్యోగమే లక్ష్యంగా 'క్యా బోల్తీ పబ్లిక్' పేరుతో CJP సెప్టెంబర్‌లో దేశవ్యాప్త యాత్రకు సిద్ధమైంది. వ్యవస్థలపై ఫౌండర్ అభిజీత్ డిప్కే సంచలన వ్యాఖ్యలు చేశారు.

J

National | Published On Aug 6, 2026, 5.53 pm IST

Kya Bolti Public Tour | క్యా బోల్తీ పబ్లిక్ : విద్యా వ్యవస్థలో సంస్కరణలు, నిరుద్యోగ సమస్యలపై అభిజీత్ డిప్కే దేశవ్యాప్త పర్యటన

సంక్షిప్త సారాంశం

మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్‌లో రెండు రోజుల పాటు సీజేపీ కోర్ కమిటీ సమావేశం జరిగింది. సెప్టెంబర్ నెలలో 'క్యా బోల్తీ పబ్లిక్' పేరుతో దేశవ్యాప్త పర్యటనను పార్టీ ఫౌండర్ అభిజీత్ డిప్కే ప్రకటించారు. దేశంలో తీవ్ర భారంగా మారిన విద్యా వ్యవస్థలో సంస్కరణలు, నిరుద్యోగ సమస్యలపైనే ఈ యాత్రలో ప్రధానంగా ఫోకస్ చేయనున్నారు. ఎన్నికల సంఘం, న్యాయవ్యవస్థ తీరుపై డిప్కే తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

Advertisement
  • సెప్టెంబర్‌లో సీజేపీ 'క్యా బోల్తీ పబ్లిక్' యాత్ర
  • రెండు రోజుల పాటు జరిగిన పార్టీ కోర్ కమిటీ మీటింగ్
  • వాళ్లు పబ్లిక్‌కు పూర్తిగా డిస్‌కనెక్ట్ అయ్యారు
  • దేశంలోని నిరుద్యోగుల్లో 80 శాతం మంది గ్రాడ్యుయేట్లే
  • ఎన్నికల సంఘం, కోర్టులపై అభిజీత్ డిప్కే సంచలన వ్యాఖ్యలు

Kya Bolti Public Tour | త్రినేత్ర.న్యూస్ : మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్ వేదికగా కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ డిప్కే సంచలన ప్రకటన చేశారు. దేశంలోని యువత, సామాన్య ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు సెప్టెంబర్ నెలలో "క్యా బోల్తీ పబ్లిక్" (Kya Bolti Public) పేరుతో దేశవ్యాప్త పర్యటన చేపట్టనున్నట్లు గురువారం ఆయన ప్రకటించారు. రెండు రోజుల పాటు జరిగిన పార్టీ కోర్ కమిటీ సమావేశం అనంతరం డిప్కే ఈ నిర్ణయాన్ని వెల్లడించారు. అధికారంలో ఉన్నవారు ప్రజల సమస్యలను వినడానికి సిద్ధంగా లేరని, వారు పబ్లిక్‌కు పూర్తిగా డిస్‌కనెక్ట్ అయ్యారని ఆయన విమర్శించారు.

అంబేద్కర్ ఆశయమే లక్ష్యంగా

ఈ దేశవ్యాప్త యాత్రలో ప్రధానంగా విద్యా సంస్కరణలు, నిరుద్యోగ సమస్యలనే ప్రధాన అస్త్రాలుగా తీసుకోనున్నారు. ఒకటో తరగతి చదివించేందుకే లక్షల రూపాయలు ఫీజులు వెచ్చించాల్సి వస్తోందని, ఆ తర్వాత కాలేజీలు, కోచింగ్ ఫీజుల భారం కుటుంబాలను అప్పుల పాలు చేస్తోందని డిప్కే ఆవేదన వ్యక్తం చేశారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా విద్యను ఒక వ్యాపారంగా కాకుండా, ప్రాథమిక హక్కుగా మార్చాలన్నదే తమ ప్రధాన డిమాండ్ అని ఆయన స్పష్టం చేశారు. దేశంలో నిరుద్యోగుల్లో దాదాపు 80 శాతం మంది గ్రాడ్యుయేట్లే ఉన్నారని, చదువుకోని వారు ప్రభుత్వాలు నడుపుతూ తమ భవిష్యత్తును నిర్ణయిస్తుండటంతో యువతలో తీవ్ర నైరాశ్యం నెలకొందన్నారు.

CJP Launches Nationwide Kya Bolti Public Tour for Education Reform

వ్యవస్థలపై నమ్మకం సన్నగిల్లుతోంది

దేశంలోని రాజ్యాంగ వ్యవస్థల తీరుపైనా డిప్కే సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వాలే ఓటర్లను డిసైడ్ చేసే స్థాయికి వ్యవస్థలు దిగజారాయని, ఎలక్షన్ కమిషన్ జవాబుదారీతనం కోల్పోయిందని విమర్శించారు. దాన్ని సరిదిద్దకపోతే ఎలక్షన్ మానిప్యులేషన్స్ ఇలాగే కొనసాగుతాయన్నారు. ఇక న్యాయవ్యవస్థ పనితీరుపైనా సామాన్యుల్లో నమ్మకం సన్నగిల్లుతోందన్నారు. సామాన్యుల కేసులకు ఏళ్ల తరబడి తీర్పులు రావడం లేదని, అదే బడా వ్యాపారవేత్తలు, ప్రభుత్వాన్ని పడగొట్టాల్సిన రాజకీయ కేసులైతే అర్ధరాత్రి పూట కూడా విచారణలు జరుగుతున్నాయని ఆయన మండిపడ్డారు. ఈడీ, సీబీఐలను ప్రయోగించి పార్టీలను విచ్ఛిన్నం చేస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు.

జెన్-జీ పవర్

యువత సమస్యలను పాలకులకు వినిపించేలా ఈ క్యాంపెయిన్ ఉండబోతోందని సీజేపీ తెలిపింది. సీజేఐ సూర్యకాంత్ చేసిన "కాక్రోచెస్, పారాసైట్స్" వ్యాఖ్యల (నకిలీ డిగ్రీలతో వృత్తుల్లోకి వస్తున్నవారిని ఉద్దేశించి చేసినవి) నేపథ్యంతో ఈ పార్టీ పుట్టుకొచ్చింది. అనతికాలంలోనే సోషల్ మీడియాలో మిలియన్ల కొద్దీ ఫాలోవర్లను సంపాదించుకుంది. పరీక్షల అవకతవకలపై జూన్ 6న అప్పటి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు వ్యతిరేకంగా సీజేపీ నిరసనలకు దిగింది. విద్యావంతులైన యువత రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేయడంతో, ఆ ఒత్తిడికి తలొగ్గి మంత్రి రాజీనామా చేయాల్సి వచ్చింది. యువత సమస్యలను పక్కనపెడితే, జెన్-జీ పవర్ ఏంటో మళ్లీ రోడ్లెక్కి చూపిస్తామని డిప్కే హెచ్చరించారు.

Advertisement
Advertisement