త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Chennai Express | డేంజర్‌ సిగ్నల్ ప‌డినా ఆగ‌లే.. చెన్నై ఎక్స్‌ప్రెస్‌కు త‌ప్పిన ముప్పు

Chennai Express | చెన్నై సూప‌ర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌కు (Chennai Express) పెను ప్ర‌మాదం త‌ప్పింది. డేంజ‌ర్ సిగ్న‌ల్ (Danger Signal) ప‌డినప్ప‌టికీ రైలు ఆగ‌లేదు. లోకోపైల‌ట్ రైలును అర కిలోమీట‌రు దూరంలో నిలిపివేశాడు.

G

National | Published On Feb 4, 2026, 10.21 am IST

Chennai Express | డేంజర్‌ సిగ్నల్ ప‌డినా ఆగ‌లే.. చెన్నై ఎక్స్‌ప్రెస్‌కు త‌ప్పిన ముప్పు
Advertisement

Chennai Express | త్రినేత్ర‌.న్యూస్‌: చెన్నై సూప‌ర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌కు (Chennai Express) పెను ప్ర‌మాదం త‌ప్పింది. డేంజ‌ర్ సిగ్న‌ల్ (Danger Signal) ప‌డినప్ప‌టికీ రైలు ఆగ‌లేదు. లోకోపైల‌ట్ రైలును అర కిలోమీట‌రు దూరంలో నిలిపివేశాడు. అలాగే ముందుకు వెళ్తే ప‌రిస్థితి మ‌రోలా ఉండేద‌ని అధికారులు వెల్ల‌డించారు.

చెన్నై సూప‌ర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌ (12604) చ‌ర్ల‌ప‌ల్లి టెర్మిన‌స్‌ నుంచి చెన్నై సెంట్ర‌ల్ వెళ్తున్న‌ది. తెల్ల‌వారుజామున 2.58 గంట‌ల స‌మ‌యంలో రైలు ఏపీలోని నెల్లూరు జిల్లా బిట్ర‌గుంట స్టేష‌న్‌కు (Bitragunta Railway Station)చేరుకున్న‌ది. ఆ స‌మ‌యంలో రైలుకు డేంజ‌ర్ సిగ్న‌ల్ ప‌డింది. అయినా ఆగ‌కుండా వెళ్లింది. సుమారు అర కిలోమీట‌ర్ దూరం ముందుకు వెళ్లి నిలిచింది. అదే వేగంతో వెళ్లి ఉంటే పెద్ద ప్ర‌మాదమే జ‌రిగి ఉండేద‌ని అధికారులు ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.

కాగా,స్టేష‌న్ నుంచి ఘ‌ట‌నా స్థ‌లానికి వెళ్లిన అధికారులు రైలులోని లోకో పైలట్లు, ట్రైన్‌ మేనేజర్లను దింపేశారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి రైలును అక్క‌డి నుంచి పంపించారు. ఈ ఘ‌ట‌న‌పై డివిజన్‌ స్థాయి అధికారులు, వైద్యాధికారులు సిబ్బందిని రహస్యంగా విచారిస్తున్నట్లు తెలుస్తున్న‌ది. డైంజ‌ర్ సిగ్న‌ల్‌ను గ‌మ‌నించ‌కుండా రైలును అలాగే ముందుకు ఎలా తీసుకెళ్లార‌ని ఆరాతీస్తున్నారు.

చార్మినార్ ఎక్స్‌ప్రెస్‌లో మార్పు..

హైద‌రాబాద్ నుంచి త‌మిళ‌నాడులోని తాంబ‌రం వ‌ర‌కు వెళ్లే చార్మినార్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లో (12760) అధికారులు మార్పులు చేశారు. ప్రస్తుతం ఉన్న గమ్యస్థానాన్ని మారుస్తున్న‌ట్లు వెళ్ల‌డించారు. ఇది ఏప్రిల్ 4వ తేదీ వరకు అమ‌ల్లో ఉంటుంద‌ని చెప్పారు. దీంతో ట్రైన్ చెన్నై బీచ్‌కు ఉదయం 7 గంటలకు చేరుకోనుంది.

సాధార‌ణంగా ఈ రైలు హైదరాబాద్ నుంచి తమిళనాడులోని తాంబరం వరకు రాకపోకలు సాగిస్తుంది. అయితే చెన్నై ఎగ్మోర్ స్టేషన్‌లో అభివృద్ది పనులు జరుగుతున్నాయి. దీంతో ఈ రైలును తాంబరం స్టేషన్ వరకు కాకుండా తాత్కాలికంగా చెన్నై బీచ్ రైల్వే స్టేషన్ వరకే పరిమితం చేశారు. ఈ నేప‌థ్యంలో చార్మినార్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణాలు చేసే వారు తమ టికెట్లను చెన్నై బీచ్ స్టేషన్ వరకే బుక్ చేసుకోవాలి.

మరోవైపు తాంబరం స్టేషన్‌కు బదులుగా చెన్నై బీచ్ నుంచి బయలుదేరే చార్మినార్ ఎక్స్ ప్రెస్ (12759) ఫిబ్రవరి 4 నుంచి ఏప్రిల్ 5 వరకు సాయంత్రం 6.20కు బయలుదేరుతుంది. ఈ మార్పును ప్రయాణికులు గమనించాలని రైల్వే అధికారులు సూచించారు.

Advertisement
Advertisement