త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Union Budget 2026 | యువ శ‌క్తి కేంద్రంగా బ‌డ్జెట్‌.. కేంద్ర ఆర్థిక‌మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్‌

Union Budget 2026 | పార్ల‌మెంట్‌లో ఆర్థిక‌మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెడుతున్నారు. ప‌విత్ర‌మైన మాఘ‌పౌర్ణ‌మి రోజున బ‌డ్జెట్‌ను పార్ల‌మెంట్‌లో ప్ర‌వేశ‌పెడుతున్నామ‌న్నారు. ప్ర‌పంచ మార్కెట్ల‌తో భార‌త్‌ను అనుసంధాన‌పిస్తున్నామ‌న్నారు. భార‌త‌దేశ ఆర్థిక ప్ర‌యాణం స్థిరంగా సాగుతోంద‌ని, యువ శ‌క్తి కేంద్రంగా బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ‌పెడుతున్నామ‌ని తెలిపారు.

P

National | Published On Feb 1, 2026, 11.25 am IST

Union Budget 2026 | యువ శ‌క్తి కేంద్రంగా బ‌డ్జెట్‌.. కేంద్ర ఆర్థిక‌మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్‌
Advertisement

Union Budget 2026 | పార్ల‌మెంట్‌లో ఆర్థిక‌మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెడుతున్నారు. ప‌విత్ర‌మైన మాఘ‌పౌర్ణ‌మి రోజున బ‌డ్జెట్‌ను పార్ల‌మెంట్‌లో ప్ర‌వేశ‌పెడుతున్నామ‌న్నారు. ప్ర‌పంచ మార్కెట్ల‌తో భార‌త్‌ను అనుసంధాన‌పిస్తున్నామ‌న్నారు. భార‌త‌దేశ ఆర్థిక ప్ర‌యాణం స్థిరంగా సాగుతోంద‌ని, యువ శ‌క్తి కేంద్రంగా బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ‌పెడుతున్నామ‌ని తెలిపారు. ప్ర‌జ‌ల ఆంకాంక్ష‌ల‌ను ఆచ‌ర‌ణ‌లోకి తీసుకువ‌స్తున్నామ‌ని, రైతులు, ద‌ళిత‌, గిరిజ‌న స‌మూహాల‌కు అభివృద్ధి ఫ‌లాలు చేరాల‌న్నారు. క‌ర్త‌వ్యభ‌వ‌న్‌లో రూపొందించిన మూడో బ‌డ్జెట్ ఇదేన‌ని. నైపుణ్యం, పోటీత‌త్వం, ఉత్పాద‌క‌తో భార‌త్‌ను ప్ర‌పంచ స్థాయికి తీసుకెళ్తామ‌న్నారు. స‌బ్ కా సాత్‌, స‌బ్ కా వికాస్ ఆధారిత బ‌డ్జెట్ అని, అభివృద్ధిలో అంద‌రి భాగ్య‌స్వామ్యం ఉండేలా చూస్తామ‌ని నిర్మ‌లా సీతారామ‌న్ పేర్కొన్నారు.

2025 ఆగ‌స్టు త‌ర్వాత 350 సంస్క‌ర‌ణ‌లు తీసుకువ‌చ్చామ‌ని, ఆర్థిక ప్ర‌ణాళిక‌పై అంత‌ర్జాతీయ ప‌రిణామాల ప్ర‌భావం ఉంద‌ని విత్త‌మంత్రి వెల్ల‌డించారు. ఆర్థిక సుస్థిర‌త కోసం ఆరు కీల‌క రంగాల్లో సంస్క‌ర‌ణ‌లు తీసుకువ‌చ్చామ‌ని, చాంపియ‌న్ ఎంఎస్ఎంఈల కోసం ప్ర‌త్యేక కార్యాచార‌ణ రూపొందించామ‌న్నారు. రూ.10వేల కోట్తో వ‌చ్చే ఐదేళ్ల‌కు బ‌యోఫార్మా శ‌క్తి ప‌థ‌కం తీసుకువ‌స్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఫార్మా ఎడ్యేకేష‌న్‌, ప‌రిశోధ‌న‌కు జాతీయ స్థాయిలో కొత్త విద్యాసంస్థ‌లు ఏర్పాటు చేస్తున్న‌ట్లు చెప్పారు. దేశ సెమీ కండ‌క్ట‌ర్ రంగం వృద్ధి కోసం ఇండియా సెమీ కండ‌క‌ర్ట‌ర్ మిష‌న్ 2.0 మిష‌న్‌ను ప్రారంభించ‌నున్న‌ట్లు తెలిపారు. ఈ మిష‌న్ కోసం రూ.40వేల కోట్లు వెచ్చించ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు. రేర్ ఎర్త్ మిన‌ర‌ల్స్ కోసం ఏపీ స‌హా ఐదు రాష్ట్రాల్లో ప్ర‌త్యేక కార్య‌క్ర‌మం అమ‌లు చేస్తామ‌న్నారు.

Advertisement
Advertisement