Andhra University | వండేళ్ళ వేలుగు.. త్రరాల ప్రగతికి అడుగు..
Andhra University | ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలో ఉన్న ఆంధ్ర విశ్వవిద్యాలయం (Andhra University) శతాబ్ది ఉత్సవాలు (Centenary Celebrations) ఘనంగా జరిగాయి. ఉత్సవాల సందర్భంగా అతిథులకు పంపిణీ చేసిన స్నాక్ బాక్సులు (Snack Box) ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి.
Andhra University | త్రినేత్ర.న్యూస్: ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలో ఉన్న ఆంధ్ర విశ్వవిద్యాలయం (Andhra University) శతాబ్ది ఉత్సవాలు (Centenary Celebrations) ఘనంగా జరిగాయి. ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, సచిన్ టెండూల్కర్ సహా అతిరథ మహారధులు ఈ వేడుకలకు హాజరయ్యారు. అయితే ఉత్సవాల సందర్భంగా అతిథులకు పంపిణీ చేసిన స్నాక్ బాక్సులు (Snack Box) ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. ఆ బాక్సులపై రాసిన తెలుగు పదా ల్లోని దోషాలను చూసి ఆహుతులు అవాక్కయ్యారు.
ఈ నెల 27న (సోమవారం) ఏయూ ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో నిర్వహించిన వందేండ్ల ఉత్సవంలో భాగంగా అతిథులకు స్నాక్ బాక్స్లు అందించారు. వాటిపై శతాబ్ది ఉత్సవాల వివరాలతో కూడిన కాగితాన్ని అతికించారు. దానిపై ‘వందేళ్ల వెలుగు.. తరాల ప్రగతికి అడుగు’ అనే నినాదానికి బదులు `వండేళ్ళ వేలుగు-త్రరాల ప్రగతికి అడుగులు` అని ముద్రించారు. వాటిని చూసిన ఆహుతులు ఏయూ అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

వందేండ్ల వైభవం
ఆంధ్రవిశ్వవిద్యాలయం ఇటీవలే 100 ఏండ్లు పూర్తిచేసుకు శతాబ్ది ఉత్సవాలు నిర్వహించుకున్నది. ఈ యూనివర్సిటీని 1926 ఏప్రిల్ 26న మద్రాసు రాష్ట్రంలో భాగంగా ఉన్న విజయవాడలో ప్రారంభించారు. మద్రాస్ యాక్ట్ 1925 ద్వారా బ్రిటిష్ ఇండియాలో 13వ యూనివర్సిటీగా ఇది ఆవిర్భవించింది. వర్శిటీకి 1926 నుంచి 1931 వరకు కట్టమంచి రామలింగారెడ్డి (సీఆర్ రెడ్డి) వ్యవస్థాపక వైస్ చాన్సలర్గా పనిచేశారు. అయితే విజయవాడలో వాతావరణం వేడిగా ఉండటంతో విశాఖపట్నంలోని వాల్తేరుకు 1930లో తరలించారు. సీఆర్ రెడ్డి తర్వాత యూనివర్శిటీ ఉప కులపతిగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ 1931లో పనిచేశారు. అనంతరం 1936 నుంచి 1949 వరకు సీఆర్ రెడ్డి మరోసారి వైస్ చాన్సలర్గా వ్యవహరించారు.

ఆరంభంలో ఆర్ట్స్ కోర్సులే..
1930లో 55 ఎకరాల్లో ఏర్పాటైన ఏయూ.. ప్రస్తుతం దాదాపు 422 ఎకరాల్లో విస్తరించి ఉంది. తొలుత ఇక్కడ ఆర్ట్స్ కోర్సులైన తెలుగు భాషా సాహిత్యం, చరిత్ర, అర్థశాస్త్రం, రాజనీతి శాస్త్రం, చరిత్ర సబ్జెక్టులు బోధించేవారు. ఆ తర్వాత 1932లో సైన్స్ అండ్ టెక్నాలజీ కాలేజీ ఏర్పాటు చేసి ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులతో ఆనర్స్ కోర్సులను ప్రారంభించారు. దేశంలోనే తొలిసారి 1934 నుంచి కామర్స్లో ఆనర్స్ డిగ్రీ మొదలుపెట్టారు. 1957లో దేశంలోనే మొట్టమొదటిసారి ఎంబీఏ ప్రవేశపెట్టారు. మెరైన్ ఇంజినీరింగ్, అణు భౌతిక శాస్త్రం (Nuclear Physics), వాతావరణ శాస్త్రాలలో దేశంలోనే తొలిసారిగా కోర్సులను ప్రవేశపెట్టిన ఘనత ఆంధ్ర యూనివర్శిటీకి దక్కుతుంది. ప్రస్తుతం ఏయూలో ఆర్ట్స్, సైన్స్, ఇంజినీరింగ్, ఫార్మసీ, లా ఇలా 58 డిపార్ట్మెంట్లు, 16 పరిశోధనా కేంద్రాలు ఉన్నాయి.
సంబంధిత వార్తలు

Rakul Preet Singh | ప్రభాస్ సినిమా నుంచి నన్ను తీసేశారు – రకుల్ కామెంట్స్…
మే 8, 2026

Ranji Trophy | చరిత్ర సృష్టించిన జమ్మూ కశ్మీర్.. 67 ఏళ్ల తర్వాత తొలిసారిగా రంజీ ట్రోఫీ కైవసం..!
ఫిబ్రవరి 28, 2026

CPI Centenary Closing Ceremony | సీపీఐ శతవసంతాల ముగింపు సభకు సీఎం రేవంత్ రెడ్డి: ఖమ్మం పర్యటనకు గ్రీన్ సిగ్నల్
జనవరి 12, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



