Assembly Elections | అసెంబ్లీ ఎన్నికలు.. అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో కొనసాగుతున్న పోలింగ్
Assembly Elections | అస్సాం (Assam), కేరళంతోపాటు (Keralam) కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో (Puducherry) శాసనసభ ఎన్నికల పోలింగ్ (Assembly Elections) కొనసాగుతున్నది. ఉదయం 7 గంలకు ప్రారంభమైన సాయంత్రం 6 గంటల వరకు జరుగనుంది.
Assembly Elections | త్రినేత్ర.న్యూస్: అస్సాం (Assam), కేరళంతోపాటు (Keralam) కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో (Puducherry) శాసనసభ ఎన్నికల పోలింగ్ (Assembly Elections) కొనసాగుతున్నది. ఉదయం 7 గంలకు ప్రారంభమైన సాయంత్రం 6 గంటల వరకు జరుగనుంది. మొత్తం 296 నియోజకవర్గాల్లో పోలింగ్ జరగుతున్నది. ఓటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా భారీగా పోలీసులను మోహరించారు. మూడు రాష్ట్రాల్లో ఒకే విడతలో పోలింగ్ జరుతుండగా, మే 4న ఓట్లను లెక్కించనున్నారు.
కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో 30 స్థానాలకు పోలింగ్ జరగుతున్నది. ఇక్కడ 294మంది అభ్యర్థులు బరిలో ఉండగా, 9,48,977 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. అందులో 4,45,761 మంది పురుషులు, 5,03,076 మంది మహిళలు, 140 మంది ట్రాన్స్జెండర్లు ఉన్నారు. అయితే, ప్రధానంగా ఎన్డీఏ- ఇండియా కూటమికి మధ్య పోటీ నెలకొంది. 1,099 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
#WATCH | Assam Elections 2026 | Long queues formed outside polling stations 115 and 116 as voters await their turn to cast a vote.
Polling begins at 7 am. pic.twitter.com/jJsm24usvj
— ANI (@ANI) April 9, 2026
అసోంలోని 126అసెంబ్లీ స్థానాల్లో 722మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. మొత్తం 2.5కోట్ల మంది ఓటర్లు ఉండగా, వారికోసం 31,490 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇక్కడ ప్రధానంగా బీజేపీ, కాంగ్రెస్ మధ్య పోటీ నెలకొన్నది. కాంగ్రెస్ పార్టీ అత్యధికంగా 99 స్థానాల్లో, బీజేపీ 90 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టాయి. మొత్తం అభ్యర్థుల్లో కేవలం 59 మంది మాత్రమే మహిళలు ఉండటం గమనార్హం.
కేరళలో 140 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 883 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. రాష్ట్రంలోని 2.71 కోట్ల మంది ఓటర్ల కోసం 30, 495 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో 1.32 కోట్ల మంది పురుషులు, 1.39 కోట్ల మంది మహిళలు, 273 మంది ట్రాన్స్జెండర్లు ఉన్నారు. ప్రధానంగా ఎల్డీఎఫ్, యూడీఎఫ్, ఎన్డీఏ కూటముల మధ్య పోటీ నెలకొంది.
Calling upon the people of Keralam to vote in large numbers in the 2026 Assembly elections. Record participation will add vigour to Keralam’s democratic spirit. I particularly request the youth and women of the state to step forward and vote in large numbers.
— Narendra Modi (@narendramodi) April 9, 2026
అసెంబ్లీ ఎన్నికల్లో పెద్ద సంఖ్యలో ఓటర్లు పాల్గొనాలని కేరళం ప్రజలకు ప్రధాని మోదీ (PM Modi) పిలుపునిచ్చారు. రికార్డు స్థాయిలో పాల్గొనడం ద్వారా కేరళం (Keralam) ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటాలన్నారు. ప్రత్యేకంగా మహిళలు, యువత ఓటు వేయడానికి భారీగా తరలిరావాలని కోరారు.
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






