Delhi Politics | ఆ ఏడుగురు ఎంపీలపై ఫిరాయింపుల అస్త్రం..! మరో రాజకీయ పోరుకు సిద్ధమైన ఆప్..!
Delhi Politics | ఆప్కు చెందిన ఏడుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరడం దేశ రాజకీయాల్లో భారీ ప్రకంపనలు వచ్చాయి. వారి సభ్యత్వాన్ని రద్దు చేయాలని ఆప్ డిమాండ్ చేయడం యాంటీ డిఫెక్షన్ చట్టంపై మళ్లీ చర్చ జరుగుతోంది.
Delhi Politics | దేశ జాతీయ రాజధానిలో మరోసారి రాజకీయాలు వేడెక్కాయి. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఏడుగురు రాజ్యసభ సభ్యులు భారతీయ జనతా పార్టీలో చేరడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ పరిణామాన్ని ప్రతిపక్షాలు ప్రజాస్వామ్యంపై దాడిగా అభివర్ణిస్తూ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు గుప్పిస్తున్నాయి. ఆప్ సైతం కౌంటర్ దాడి ప్రారంభించింది. పార్టీ నాయకుడు సంజయ్ సింగ్ మాట్లాడుతూ పార్టీని వీడిన ఆ ఏడుగురు ఎంపీల రాజ్యసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని రాజ్యసభ చైర్మన్ను అధికారికంగా కోరినట్లు వెల్లడించారు. పార్టీని వీడిన తర్వాత ఎంపీ పదవిలో కొనసాగడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని వ్యాఖ్యానించారు. పార్టీ తరఫున ఇప్పటికే పిటిషన్ సమర్పించినట్లు తెలిపారు. ఈ ఎంపీలు ఇకపై పార్టీకి చెందిన వారు కారని, కాబట్టి సభ్యత్వం కొనసాగకూడదని పేర్కొన్నారు. పార్టీని వీడినా పదవులు కొనసాగించడం నిబంధనలకు వ్యతిరేకమని ఆరోపించారు.
యాంటీ డిఫెక్షన్ చట్టం ఏమిటి?
ఈ ఘటన దేశవ్యాప్తంగా యాంటీ డిఫెక్షన్ (ఫిరాయింపుల) చట్టంపై మళ్లీ చర్చను రేకెత్తించింది. 1985లో 52వ రాజ్యాంగ సవరణ ద్వారా అమల్లోకి వచ్చిన ఈ చట్టం, ప్రజాప్రతినిధులు పార్టీ మార్పులను నియంత్రించడానికి తీసుకువచ్చారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత పార్టీని విడిచి మరో పార్టీలో చేరడం ద్వారా ప్రజల ఓటు విలువను దెబ్బతీయకుండా నిరోధించడం దీని ముఖ్య ఉద్దేశ్యం. ఈ చట్టం ప్రకారం.. ఎంపీ, ఎమ్మెల్యే తమ పార్టీని విడిచినా, పార్టీ విప్ను ఉల్లంఘించినా, వారి సభ్యత్వాన్ని రద్దు చేయొచ్చు. ఈ విషయంలో తుది నిర్ణయం సంబంధిత సభ స్పీకర్, చైర్మన్ తీసుకుంటారు. అయితే, కొన్ని మినహాయింపులు కూడా ఉన్నాయి. గతంలో ఒక వంతు సభ్యులు విడిపోయి మరో వర్గంగా ఏర్పడితే అనర్హత వర్తించేది కాదు. కానీ, తర్వాతి సవరణలతో ఈ నిబంధనల్లో మార్పులు జరిగాయి. ప్రస్తుతం పార్టీ విలీనం వంటి ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే కొంత ఉపశమనం లభిస్తుంది. ప్రస్తుతం చోటుచేసుకున్న ఈ పరిణామంలో పార్టీ ఫిరాయింపుల చట్టం ఎలా వర్తిస్తుందనేది చర్చనీయాంశంగా మారింది.
రాజ్యసభ చైర్మన్దే తుది నిర్ణయం?
ఈ ఎంపీలు పార్టీని ఏ విధంగా వదిలి వెళ్తారు. అధికారికంగా రాజీనామా చేశారా? లేదంటే నేరుగా మరో పార్టీలో చేరార? అనే అంశాల ఆధారంగా నిర్ణయం ఆధారపడి ఉంటుంది. రాజ్యసభ చైర్మన్ అన్ని వివరాలను పరిశీలించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఈ ఘటనతో దేశ రాజకీయాల్లో కొత్త సమీకరణలు ఏర్పడే అవకాశాలపై చర్చ జరుగుతోంది. ఒకవైపు ప్రతిపక్షాలు దీన్ని ప్రజాస్వామ్యానికి ముప్పుగా అభివర్ణిస్తుండగా, మరోవైపు అధికార పార్టీ మాత్రం దీనిపై ఇంకా అధికారికంగా స్పందించలేదు. ఈ పరిణామం కేవలం పార్టీ మార్పు కాకుండా, చట్టపరమైన, రాజకీయంగా కీలకంగా మారింది. రాజ్యసభ చైర్మన్ ఏం నిర్ణయం తీసుకుంటారనేది చర్చనీయాంశంగా మారింది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Vande Mataram | ఇక మదర్సాల్లోనూ వందేమాతరం తప్పనిసరి.. బెంగాల్ సర్కార్ కీలక నిర్ణయం
మే 21, 2026

Niranjan Reddy | గోదావరి – కావేరి అనుసంధానానికి ఎలా ఒప్పుకుంటారు?: మాజీ మంత్రి నిరంజన్రెడ్డి
మే 21, 2026

SIR | అర్హులకు ఓటు హక్కు కల్పించడమే సర్ లక్ష్యం : కలెక్టర్ గరిమ అగ్రవాల్
మే 20, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



