త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Airfares Surge for Holi | హోలీ పండుగ ఎఫెక్ట్.. విమాన ధరలకు రెక్కలు

పండుగ సమయాల్లోనే ఒక్కసారిగా ఎయిర్ చార్జీలు పెంచడంపై సుప్రీంకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. గత కొన్ని సంవత్సరాలుగా ఇదే తంతు సాగుతోందని జస్టిస్ విక్రమ్ నాథ్‌తో కూడిన ధర్మాసనం అభిప్రాయపడింది.

J

National | Published On Feb 24, 2026, 6.12 pm IST

Airfares Surge for Holi | హోలీ పండుగ ఎఫెక్ట్.. విమాన ధరలకు రెక్కలు
Advertisement

Airfares Surge for Holi | మార్చి 4న హోలీ పండుగను దేశవ్యాప్తంగా ప్రజలంతా జరుపుకోనున్నారు. ఈనేపథ్యంలో హోలీ పండుగను ఇంటికి వెళ్లి తమ కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి జరుపుకోవాలని అనుకున్న చాలామందికి ఎయిర్‌లైన్స్ సంస్థలు షాకిచ్చాయి. ఎందుకంటే హోలీ పండుగ సందర్భంగా విమాన ధరలు భారీగా పెరిగాయి. ఫిబ్రవరి లాస్ట్ వీక్ నుంచి మార్చి ఫస్ట్ వీక్ వరకు డొమెస్టిక్ రూట్లలో భారీగా ధరలను పెంచారు. అది కూడా 10 శాతమో 20 శాతమో కాదు.. ఒక రూట్‌లో అయితే ఏకంగా 185 శాతం పెంచారు. దీంతో హోలీ పండుగను తమ సొంతూరుకు వెళ్లి జరుపుకోవాలని అనుకునే వాళ్ల పాకెట్‌ ఖాళీ కానుంది.

మధ్య తరగతి ప్రజలు డొమెస్టిక్ రూట్‌లో రూ.20 వేలు పెట్టి విమాన టికెట్ కొంటారా? మామూలుగా రూ.7 వేలు ఉండే టికెట్‌ను రూ.20 వేలకు అమ్ముతున్నారు. అంత డబ్బు పెట్టి టికెట్ కొనే స్థోమత చాలామందికి ఉండదు. బెంగళూరు, ముంబై, వారణాసి, గోరఖ్‌పూర్, ఢిల్లీ, చెన్నై లాంటి నగరాలకు వెళ్లాలనుకునే వాళ్లు విమాన ధరలు చూసి బెంబేలెత్తిపోతున్నారు. పోనీ.. రైళ్లలో వెళ్దామంటే ఇప్పటికే రైళ్లు అన్నీ ఫుల్ అయ్యాయి. బస్సులు కూడా ఫుల్. విమాన ధరలు చూస్తే రెక్కలు వచ్చాయి అంటూ ఓ వ్యక్తి ఎక్స్‌లో తన బాధను వెళ్లగక్కాడు.

గత పది పదిహేను రోజుల నుంచి విమాన చార్జీలను చూస్తున్నా. రాకెట్‌లా దూసుకుపోతున్నాయి. ఫెస్టివల్ అంటే మనుషులను కలపాలి కానీ.. ఇలా ప్రయాణం అంటేనే భయపడిపోయేలా చేస్తున్నాయి ఎయిర్‌లైన్స్ అంటూ మరో వ్యక్తి ట్వీట్ చేశాడు.

హోలీ, దివాళీకి ధరల పెంపు కామనే

నిజానికి హోలీ, దివాళీ లాంటి పండుగలకు విమాన ధరలు పెరగడం కామనే. ఎందుకంటే ఈ రెండు పండుగలే దేశవ్యాప్తంగా ఎక్కువ శాతం మంది ప్రజలు జరుపుకుంటారు. అందుకే ఈ పండుగల సమయంలో ఇతర ప్రాంతాల్లో ఉన్నవారు తమ కుటుంబ సభ్యులతో కలిసి వేడుకలు చేసుకోవాలనుకుంటారు. కానీ.. ఇదే అదునుగా భావించి ఎయిర్‌లైన్స్ కూడా ధరలను విపరీతంగా పెంచేస్తుంటాయి.

సుప్రీంకోర్టు సీరియస్

పండుగ సమయాల్లోనే ఒక్కసారిగా ఎయిర్ చార్జీలు పెంచడంపై సుప్రీంకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. గత కొన్ని సంవత్సరాలుగా ఇదే తంతు సాగుతోందని జస్టిస్ విక్రమ్ నాథ్‌తో కూడిన ధర్మాసనం అభిప్రాయపడింది. ఎయిర్ చార్జీల పెంపుపై దాఖలైన పలు పిటిషన్లపై నాలుగు వారాల్లో నివేదికతో కూడిన అఫిడవిట్‌ని సమర్పించాలని ప్రభుత్వాన్ని ధర్మాసనం ఆదేశించింది. దీనికి సంబంధించిన విచారణ మార్చి 23న సుప్రీంలో జరగనుంది.

Advertisement
Advertisement