త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

AIADMK-BJP Alliance | త‌మిళ‌నాడు అన్నాడీఎంకే-బీజేపీ మ‌ధ్య కుదిరిన పొత్తు..!

AIADMK-BJP Alliance | త‌మిళ‌నాడులో రాజ‌కీయాలు వేడెక్కాయి. ఎన్నిక‌ల‌కు స‌మ‌యం ద‌గ్గ‌ర‌ప‌డుతున్న‌ది. పోలింగ్‌కు నెల రోజుల స‌మ‌యం మిగిలి ఉంది. ఈ క్ర‌మంలో ప‌లు పార్టీలు పొత్తుల‌పై చ‌ర్చ‌లు జ‌రుపుతున్నాయి. ఈ క్ర‌మంలోనే ప్ర‌తిప‌క్ష అన్నాడీఎంకే (AIADMK) పార్టీతో క‌లిసి బీజేపీ పోటీ చేయ‌నుంది.

P

National | Published On Mar 23, 2026, 6.57 pm IST

AIADMK-BJP Alliance | త‌మిళ‌నాడు అన్నాడీఎంకే-బీజేపీ మ‌ధ్య కుదిరిన పొత్తు..!
Advertisement

AIADMK-BJP Alliance | త‌మిళ‌నాడులో రాజ‌కీయాలు వేడెక్కాయి. ఎన్నిక‌ల‌కు స‌మ‌యం ద‌గ్గ‌ర‌ప‌డుతున్న‌ది. పోలింగ్‌కు నెల రోజుల స‌మ‌యం మిగిలి ఉంది. ఈ క్ర‌మంలో ప‌లు పార్టీలు పొత్తుల‌పై చ‌ర్చ‌లు జ‌రుపుతున్నాయి. ఈ క్ర‌మంలోనే ప్ర‌తిప‌క్ష అన్నాడీఎంకే (AIADMK) పార్టీతో క‌లిసి బీజేపీ పోటీ చేయ‌నుంది. ఈ మేర‌కు రెండు పార్టీల మ‌ధ్య సీట్ల పంప‌కంపై ఒప్పందం కుదిరింది. చెన్నైలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఏఐఏడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కే పళనిస్వామి ఈ విషయాన్ని ప్రకటించారు. రాష్ట్రంలో ఎన్‌డీఏ కూటమి పూర్తి బలంతో ఎన్నికల బరిలోకి దిగుతోందని ఆయన పేర్కొన్నారు. ఈ ఒప్పందంలో అత్యంత కీలకమైన అంశం ఏంటంటే.. బీజేపీకి సీట్లు పెర‌గ‌డ‌మే. ఈ సారి బీజేపీ 27 స్థానాల్లో పోటీ చేయ‌నుంది.

కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, పీఎంకే అగ్రనేత అన్బుమణి రామదాస్, ఏఎంఎంకే అధినేత టీటీబీ దినకరన్ ఈ సమావేశానికి హాజరయ్యారు. ఢిల్లీ నుండి చెన్నై వరకు, బీజేపీ ఈసారి తన వ్యూహాన్ని మార్చుకుంది. ఉత్తర తమిళనాడులో బలమైన పట్టు కలిగిన పీఎంకే పార్టీకి 18 స్థానాలు కేటాయించారు. వన్నియర్ సామాజిక వర్గ ఓటు బ్యాంకును ఆకర్షించేందుకు పీఎంకే మద్దతు ఈ కూటమికి కీల‌కంగా భావిస్తున్నారు. ఈ సారి ఏఎంఎంకే పార్టీకి 11 సీట్లు కేటాయించారు. తమిళనాడు అసెంబ్లీలో మొత్తం 234 స్థానాలున్నాయి. డీఎంకే పార్టీని గ‌ద్దె దించ‌డ‌మే కూట‌మి ల‌క్ష్య‌మ‌ని పళనిస్వామి పేర్కొన్నారు. అన్నాడీఎంకే, ఏఎంఎంకే క‌లిస్తే డీఎంకే విజ‌యం సాధించ‌డం క‌ష్ట‌మేన‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు పేర్కొంటున్నారు. ఇదిలా ఉండ‌గా.. డీఎంకే-కాంగ్రెస్ మ‌ధ్య సైతం సీట్ల స‌ర్దుబాటు కుదిరింది. కాంగ్రెస్‌కు 28 సీట్ల‌తో పాటు రాజ్య‌స‌భ సీటు ఇచ్చేందుకు డీఎంకే అంగీక‌రించింది. గ‌త ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ 25 స్థానాల్లో పోటీ చేయ‌గా.. ఈ సారి అద‌నంగా మ‌రో మూడు సీట్లు పెరిగాయి.

Advertisement

తాజావార్తలు

Advertisement