త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Murder | భ‌గ్గుమ‌న్న పాత‌క‌క్ష‌లు.. వేట కొడ‌వ‌ళ్ల‌తో అన్న‌ద‌మ్ముళ్ల‌ను న‌రికి చంపిన ప్ర‌త్య‌ర్థులు

Murder | పాత‌క‌క్ష‌ల‌తో ఓ ఇద్ద‌రు అన్న‌ద‌మ్ముళ్ల‌ను ప్ర‌త్య‌ర్థులు వేట కొడ‌వ‌ళ్ల‌తో వెంటాడి న‌రికి చంపారు. ఈ దారుణ ఘ‌ట‌న ఏపీ ప‌ల్నాడు జిల్లాలోని దుర్గి మండ‌లం అడిగొప్ప‌ల గ్రామంలో ఆదివారం అర్ధ‌రాత్రి చోటు చేసుకుంది.

S

National | Published On Dec 22, 2025, 11.55 am IST

Murder | భ‌గ్గుమ‌న్న పాత‌క‌క్ష‌లు.. వేట కొడ‌వ‌ళ్ల‌తో అన్న‌ద‌మ్ముళ్ల‌ను న‌రికి చంపిన ప్ర‌త్య‌ర్థులు
Advertisement

Murder | త్రినేత్ర‌.న్యూస్ : పాత‌క‌క్ష‌ల‌తో ఓ ఇద్ద‌రు అన్న‌ద‌మ్ముళ్ల‌ను ప్ర‌త్య‌ర్థులు వేట కొడ‌వ‌ళ్ల‌తో వెంటాడి న‌రికి చంపారు. ఈ దారుణ ఘ‌ట‌న ఏపీ ప‌ల్నాడు జిల్లాలోని దుర్గి మండ‌లం అడిగొప్ప‌ల గ్రామంలో ఆదివారం అర్ధ‌రాత్రి చోటు చేసుకుంది. ఈ జంట హ‌త్య‌ల నేప‌థ్యంలో అడిగొప్ప‌ల గ్రామంలో భారీగా పోలీసులు మోహ‌రించారు. ఎలాంటి అవాంఛ‌నీయ ఘ‌ట‌న‌లు చోటు చేసుకోకుండా పోలీసులు త‌గు జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు.

మృతుల‌ను గ్రామానికి చెందిన కొత్తా హ‌నుమంతు, కొత్త శ్రీరాంమూర్తిగా పోలీసులు గుర్తించారు. త‌మ్ముడు హ‌నుమంతును గ్రామం మ‌ధ్య‌లో, అన్న శ్రీరాంమూర్తిని అమ్మ‌వారి గుడి స‌మీపంలో వేట కొడ‌వ‌ళ్ల‌తో అత్యంత కిరాత‌కంగా న‌రికి చంపారు. అయితే అన్న‌దమ్ములిద్ద‌రూ కూడా తెలుగు దేశం పార్టీ సానుభూతి ప‌రులు అని గ్రామ‌స్తులు పేర్కొన్నారు. ఈ క్ర‌మంలో జంట హ‌త్య‌ల‌పై జిల్లా ఇంచార్జి గొట్టిపాటి ర‌వికుమార్ స్పందించారు. జిల్లా ఎస్పీతో మాట్లాడి విష‌యం తెలుసుకున్నారు. హ‌త్య‌కు పాల్ప‌డిన వారు ఎంత‌టి వారైనా వ‌దిలిపెట్టొద్ద‌ని ఆదేశించారు. ఇలాంటి ఘ‌ట‌న‌లు పున‌రావృతం కాకుండా చూడాల‌ని ఎస్పీని ర‌వికుమార్ ఆదేశించారు.

Advertisement

తాజావార్తలు

Advertisement