త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Delhi | నాలుగు అంత‌స్థుల బిల్డింగ్‌లో పేలిన ఏసీ.. 9 మంది దుర్మ‌ర‌ణం

Delhi | దేశ‌రాజ‌ధాని ఢిల్లీలో (Delhi) తీవ్ర విషాదం చోటుచేసుకున్న‌ది. ఓ అపార్ట‌మెంట్‌లో ఏసీ పేల‌డంతో (AC blast) ఒక్క‌సారిగా మంట‌లు చెల‌రేగాయి. దీంతో 9 మంది మ‌ర‌ణించారు.

G

National | Published On May 3, 2026, 9.20 am IST

Delhi | నాలుగు అంత‌స్థుల బిల్డింగ్‌లో పేలిన ఏసీ.. 9 మంది దుర్మ‌ర‌ణం
Advertisement

Delhi | త్రినేత్ర‌.న్యూస్‌: దేశ‌రాజ‌ధాని ఢిల్లీలో (Delhi) తీవ్ర విషాదం చోటుచేసుకున్న‌ది. ఓ అపార్ట‌మెంట్‌లో ఏసీ పేల‌డంతో (AC blast) ఒక్క‌సారిగా మంట‌లు చెల‌రేగాయి. దీంతో 9 మంది మ‌ర‌ణించారు. మ‌రో న‌లుగురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు.

ఆదివారం తెల్ల‌వారుజామున షాదార్‌లోని వివేక్ విహార్‌లోని నాలుగు అంత‌స్థుల నివాస స‌ముదాయంలో ఒక్క‌సారిగా మంట‌లు అంటుకున్నాయి. దీంతో చాలా మంది భవనంలో చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న అగ్నిమాప‌క సిబ్బంది ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్నారు. 14 ఫైర్ ఇంజిన్ల‌తో మంటలను అదుపుచేశారు. 12 మందికిపైగా రెస్క్యూ సిబ్బంది రక్షించారు. రెండో అంత‌స్థులో 5 మృత‌దేహాల‌ను గుర్తించారు. మ‌రో న‌లుగురి మృత‌దేహాలు మెట్ల వ‌ద్ద ల‌భించాయి. ప్రమాద తీవ్ర‌త దృష్ట్యా మృతుల సంఖ్య మరింత పెరిగే అవ‌కాశం ఉంద‌ని పోలీసులు తెలిపారు. తెల్ల‌వారుజామున 3.47 గంట‌ల స‌మ‌యంలో ప్ర‌మాదానికి సంబంధించి త‌మ‌కు స‌మాచారం అందింద‌ని చెప్పారు.

Advertisement
Advertisement