త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Road Accident | మంత్రాల‌య రాఘ‌వేంద్రుని ద‌ర్శ‌నానికి వెళ్తుండ‌గా ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది మృతి, 12 మందికి గాయాలు

Road Accident | ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని కర్నూలు (Kurnool) జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం (Road Accident) జ‌రిగింది. గురువారం తెల్లవారుజామున మంత్రాలయం (Mantralayam) మండలం చిలకలడోన వద్ద బొలెరో వాహనం-రెడీమిక్స్‌ లారీ ఢీకొన్నాయి.

G

National | Published On Apr 16, 2026, 6.58 am IST

Road Accident | మంత్రాల‌య రాఘ‌వేంద్రుని ద‌ర్శ‌నానికి వెళ్తుండ‌గా ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది మృతి, 12 మందికి గాయాలు
Advertisement

Road Accident | త్రినేత్ర‌.న్యూస్‌: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని కర్నూలు (Kurnool) జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం (Road Accident) జ‌రిగింది. గురువారం తెల్లవారుజామున మంత్రాలయం (Mantralayam) మండలం చిలకలడోన వద్ద బొలెరో వాహనం-రెడీమిక్స్‌ లారీ ఢీకొన్నాయి. దీంతో 8 మంది మృతిచెందగా, మ‌రో 12 మంది గాయ‌ప‌డ్డారు. మృతుల్లో ఐదుగురు మ‌హిళ‌లు, మూడేండ్ల చిన్నారి ఉన్నారు.

స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని స‌హాయ‌క చ‌ర్య‌లుచేప‌ట్టారు. క్ష‌త‌గాత్రుల‌ను ద‌వాఖాన‌కు త‌ర‌లించారు. ఘటనాస్థలంలోనే ఐదుగురు మృతిచెందార‌ని, ముగ్గురు ద‌వాఖాన‌లో చికిత్స పొందుతూ చనిపోయారని తెలిపారు.

వీరంతా కర్ణాటకలోని చిక్‌మంగళూరుకు చెందినవారిగా గుర్తించారు. మంత్రాలయంలోని శ్రీరాఘవేంద్రస్వామి దర్శనానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. ప్ర‌మాదం ధాటికి బొలెరో వాహ‌నం నుజ్జునుజ్జు అయింది. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదుచేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement