త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Encounter | గడ్చిరోలి ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మావోయిస్టులు మృతి.. ప్రాణాలొదిలిన కానిస్టేబుల్‌

Encounter | ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లోని బీజాపూర్ (Bijapur) అడ‌వుల్లో జ‌రిగిన కాల్పుల్లో కీల‌క నేత ఉద‌మ్ సింగ్ మృతిచెందిన ఘ‌ట‌న మ‌రువ‌క‌ముందే మావోయిస్టు పార్టీకి మ‌రో ఎదురుదెబ్బ త‌గిలింది. మ‌హారాష్ట్ర‌లోని గడ్చిరోలి ఎన్‌కౌంటర్‌లో (Encounter) ముగ్గురు మావోయిస్టులు మ‌ర‌ణించారు.

G

National | Published On Feb 6, 2026, 12.19 pm IST

Encounter | గడ్చిరోలి ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మావోయిస్టులు మృతి.. ప్రాణాలొదిలిన కానిస్టేబుల్‌
Advertisement

Encounter | త్రినేత్ర‌.న్యూస్‌: ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లోని బీజాపూర్ (Bijapur) అడ‌వుల్లో జ‌రిగిన కాల్పుల్లో కీల‌క నేత ఉద‌మ్ సింగ్ మృతిచెందిన ఘ‌ట‌న మ‌రువ‌క‌ముందే మావోయిస్టు (Maoists) పార్టీకి మ‌రో ఎదురుదెబ్బ త‌గిలింది. మ‌హారాష్ట్ర‌లోని గడ్చిరోలి ఎన్‌కౌంటర్‌లో (Encounter) ముగ్గురు మావోయిస్టులు మ‌ర‌ణించారు. భ్రమగఢ్ తాలూకాలో గురువారం సాయంత్రం నుంచి భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య జరుగుతున్న ఎదురుకాల్పులు కొన‌సాగుతున్నాయి. ఇందులో ఇద్ద‌రు మ‌హిళ‌ల‌తో స‌హా ముగ్గురు మావోయిస్టుల మృత‌దేహాలు ల‌భించాయి.

ఘ‌ట‌నా స్థ‌లంలో ఒక ఏకే-47 రైఫిల్‌తో పాటు పలు ఆయుధాలు స్వాధీనం చేసుకున్నామ‌ని పోలీసులు తెలిపారు. మావోయిస్ట్‌ల కాల్పుల్లో పోలీసు కానిస్టేబుల్‌ దీపక్‌ మాధవి ప్రాణాలు కోల్పోయార‌ని చెప్పారు. సి-60 కమాండో జోగా దీపక్‌ గాయప‌డ్డార‌ని, అత‌డిని హెలికాప్టర్‌లో గడ్చిరోలిలోని ద‌వాఖాన‌కు తరలించామ‌న్నారు. ఆ ప్రాంతంలో మావోయిస్టుల కోసం సెర్చ్ ఆప‌రేష‌న్ కొన‌సాగుతూనే ఉంద‌ని వెల్ల‌డించారు.

ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపుర్ జిల్లా అటవీప్రాంతంలో జ‌రిగిన ఎదురు కాల్పుల్లో మావోయిస్టు కీలక నేత ఉదమ్‌ సింగ్ మృతి చెందిన విష‌యం తెలిసిందే. ఘ‌టనాస్థలం నుంచి ఆయ‌న‌ మృతదేహంతో పాటు, ఒక ఏకే-47 ఆటోమేటిక్ రైఫిల్ స్వాధీనం చేసుకున్నట్లు బీజాపుర్ ఎస్పీ డాక్టర్ జితేంద్ర యాదవ్ వెల్ల‌డించారు.

కాగా, ఛత్తీసగ్​ఢ్​లో ఈ ఏడాది ఇప్పుటివరకు జరిగిన వేర్వేరు ఎన్​కౌంటర్లలో కనీసం 23 మంది మావోయిస్టులు మ‌ర‌ణించారు. జనవరి 3న సుక్మా, బీజాపుర్​లో జరిగిన రెండు ఎన్​కౌంటర్లలో 14 మంది, బీజాపుర్​లో జనవరి 17న ఆరుగురు, జనవరి 29న మరో ఇద్దరు మావోయిస్టులు మృతిచెందారు.

Advertisement
Advertisement