త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Howrah Station | 173 ఏండ్లనాటి రైల్వే స్టేష‌న్‌.. రోజూ 600కుపైగా రైళ్లు.. 10 ల‌క్ష‌ల మంది ప్ర‌యాణికులు

Howrah Station | త్రినేత్ర‌.న్యూస్‌: అది దేశంలో అతి పురాత‌న రైల్వే స్టేష‌న్ (Howrah Station). అత్య‌ధిక ప్లాట్‌ఫార‌మ్‌లు. రోజూ 600 రైళ్లు, 10 ల‌క్ష‌ల మందికిపైగా ప్ర‌యాణికులు ఆ స్టేష‌న్ మీదుగా ప్ర‌యాణిస్తుంటారు. 173 ఏండ్ల చ‌రిత్ర క‌లిగిన ఈ స్టేష‌న్‌ను ఇప్పుడు రైల్వే శాఖ మ‌రింత ఆధునీక‌రించ‌నుంది.

G

National | Published On Mar 9, 2026, 11.47 am IST

Howrah Station | 173 ఏండ్లనాటి రైల్వే స్టేష‌న్‌.. రోజూ 600కుపైగా రైళ్లు.. 10 ల‌క్ష‌ల మంది ప్ర‌యాణికులు
Advertisement

Howrah Station | త్రినేత్ర‌.న్యూస్‌: అది దేశంలో అతి పురాత‌న రైల్వే స్టేష‌న్ (Howrah Station). అత్య‌ధిక ప్లాట్‌ఫార‌మ్‌లు. రోజూ 600 రైళ్లు, 10 ల‌క్ష‌ల మందికిపైగా ప్ర‌యాణికులు ఆ స్టేష‌న్ మీదుగా ప్ర‌యాణిస్తుంటారు. 173 ఏండ్ల చ‌రిత్ర క‌లిగిన ఈ స్టేష‌న్‌ను ఇప్పుడు రైల్వే శాఖ మ‌రింత ఆధునీక‌రించ‌నుంది. మ‌రిన్ని ప్లాట్‌ఫార‌మ్‌ను ఏర్పాటు చేయ‌డంతోపాటు ఇంకొన్ని రైళ్ల‌ను ఆ స్టేష‌న్ మీదుగా న‌డిపేందుకు ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తున్న‌ది.

 

భారతదేశపు అతిపెద్ద రైల్వే స్టేషన్ పశ్చిమ బెంగాల్ రాజ‌ధాని కోల్‌కతాలోని హౌరా జంక్షన్. ఇక్కడ 23 ప్లాట్‌ఫామ్స్ ఉన్నాయి. ప్ర‌తిరోజూ సుమారు 600కుపైగా రైళ్లు న‌డుస్తుండ‌గా, దాదాపు 10.5 ల‌క్ష‌ల మందికిపైగా ఈ స్టేష‌న్ నుంచి ప్ర‌యాణిస్తున్నారు. 1854లో నిర్మించిన ఈ స్టేష‌న్ దేశంలోని అన్ని ప్రధాన నగరాలకు అనుసంధాన‌మై ఉన్న‌ది.

హౌరా జంక్షన్‌ స్టేషన్ అద్భుతమైన డిజైన్ విశేషంగా ఆకట్టుకుంటుంది. ఎర్ర-ఇటుక హౌరా రైల్వే స్టేషన్ అనేది సాంప్రదాయ వాస్తుశిల్పం, వలస, స్థానిక శైలుల కలయికతో కూడిన అద్భుతమైన భవ‌నానికి బ్రిటిష్ ఆర్కిటెక్ట్ హాల్సే రికార్డో దీనిని రూపొందించారు. 1850లో నిర్మాణం ప్రారంభించారు. 1854 ఆగస్టు 15న హౌరా-హుగ్లీ మధ్య మొదటిసారి రైలు నడిచింది. గ్రీన్ రైల్వే స్టేష‌న్ అనే ట్యాగ్ ఉన్న ఇందులో అన్ని భద్రతప్రమాణాలు, అత్యాధునిక సౌకర్యాలు ఉన్నాయి. స్టేషన్‌లో మ్యూజియం కూడా ఉండ‌టం గ‌మ‌నార్హం.

ఈ రైల్వే స్టేషన్‌ను అత్యంత రద్దీగా ఉండే ప్లాట్‌ఫారమ్‌గా కూడా పిలుస్తారు. ఇక్క‌డి నుంచి ప్రతిరోజూ 10.8 లక్షల మందికిపైగా ప్రయాణికులు ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి ప్రయాణిస్తున్నారు. 1854లో ఒకే ప్లాట్‌ఫామ్‌తో ప్రారంభ‌మైన ఈ స్టేష‌న్‌.. 1905లో మ‌రో ఆరు ప్లాట్‌ఫామ్‌ల‌ను ఏర్పాటు చేశారు. ఆ త‌ర్వాత 1984లో కొత్త‌గా 8 ప్లాట్‌ఫార‌మ్‌ల‌ను ఏర్పాటు చేయ‌డంతో వాటి సంఖ్య 15కు చేరింది. 1992లో మ‌రో నాలుగు ఏర్పాటు చేసిన‌ప్ప‌టికీ.. ర‌ద్దీకి అనుగుణంగా 2009లో ఈ స్టేష‌న్‌ను మ‌రింత విస్త‌రించారు. దీంతో ప్లాట్‌ఫామ్‌ల సంఖ్య 23కు చేరింది. తాజాగా మ‌రో ఐదేండ్ల‌లో ఈ చారిత్ర‌క స్టేష‌న్‌లో వ‌స‌తుల‌ను రెట్టింపు చేయాల‌ని రైల్వే శాఖ ప్ర‌ణాళిక‌లు రూపొందించింది.

Advertisement
Advertisement