త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Indian Army | జ‌మ్మూక‌శ్మీర్‌లో లోయ‌లో ప‌డ్డ వాహ‌నం.. 10 మంది జ‌వాన్లు మృతి

Indian Army | జ‌మ్మూక‌శ్మీర్‌లోని దోడ జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. ఆర్మీ సైన్యంతో వెళ్తున్న ఓ వాహ‌నం అదుపుత‌ప్పి లోయ‌లో ప‌డిపోయింది. ఈ ప్ర‌మాదంలో 10 మంది జ‌వాన్లు ప్రాణాలు కోల్పోగా, మ‌రో 15 మందికి పైగా తీవ్రంగా గాయ‌ప‌డ్డారు.

S

National | Published On Jan 22, 2026, 3.19 pm IST

Indian Army | జ‌మ్మూక‌శ్మీర్‌లో లోయ‌లో ప‌డ్డ వాహ‌నం.. 10 మంది జ‌వాన్లు మృతి
Advertisement

Indian Army | త్రినేత్ర‌.న్యూస్ : జ‌మ్మూక‌శ్మీర్‌లోని దోడ జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. ఆర్మీ సైన్యంతో వెళ్తున్న ఓ వాహ‌నం అదుపుత‌ప్పి లోయ‌లో ప‌డిపోయింది. ఈ ప్ర‌మాదంలో 10 మంది జ‌వాన్లు ప్రాణాలు కోల్పోగా, మ‌రో 15 మందికి పైగా తీవ్రంగా గాయ‌ప‌డ్డారు.

స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకుని స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. ఉగ్ర‌వాదుల ఏరివేత‌కు సంబంధించి సైన్యం బుల్లెట్ ప్రూఫ్ ఆర్మీ వెహిక‌ల్‌లో వెళ్తుండ‌గా ఈ ప్ర‌మాదం జ‌రిగిన‌ట్లు పోలీసులు నిర్ధారించారు. గాయ‌ప‌డ్డ జ‌వాన్లను చికిత్స నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.

లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ తీవ్ర విచారం

సైనికుల వాహ‌నం లోయ‌లో ప‌డ్డ ఘ‌ట‌న‌పై జ‌మ్మూక‌శ్మీర్ లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ మ‌నోజ్ సిన్హా తీవ్ర విచారం వ్య‌క్తం చేశారు. 10 మంది సైనికులు మృతి చెండ‌డం త‌న‌ను తీవ్రంగా క‌లిచివేసింద‌న్నారు. వారి త్యాగాలు ఎల్ల‌ప్పుడూ గుర్తుంటాయ‌న్నారు. సైనికుల కుటుంబాల‌కు ప్ర‌గాఢ సానుభూతి తెలియ‌జేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. గాయ‌ప‌డ్డ వారికి మెరుగైన వైద్యం అందించాల‌ని అధికారుల‌ను లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ ఆదేశించారు.

Advertisement

తాజావార్తలు

Advertisement