త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Bangladesh | ఢిల్లీలోని బంగ్లాదేశ్ హైక‌మిష‌న్ వ‌ద్ద ఉద్రిక్త‌త‌

Bangladesh | న్యూఢిల్లీ (New Delhi)లోని బంగ్లాదేశ్ (Bangladesh) హై క‌మిష‌న్ కార్యాల‌యం (High Commission Office) ఎదుట‌ వీహెచ్‌పీ (VHP) కార్య‌క‌ర్త‌లు భారీ నిర‌స‌న తెలిపారు.

A

International | Published On Dec 23, 2025, 1.44 pm IST

Bangladesh | ఢిల్లీలోని బంగ్లాదేశ్ హైక‌మిష‌న్ వ‌ద్ద ఉద్రిక్త‌త‌
Advertisement

Bangladesh | త్రినేత్ర‌.న్యూస్ : దేశ రాజ‌ధాని న్యూఢిల్లీ (New Delhi)లోని బంగ్లాదేశ్ (Bangladesh) హై క‌మిష‌న్ కార్యాల‌యం (High Commission Office) వ‌ద్ద తీవ్ర ఉద్రిక్త‌త ప‌రిస్థితులు త‌లెత్తాయి. ఆ దేశంలో హిందువుల‌పై జ‌రుగుతున్న దాడుల‌ను ఖండిస్తూ హై క‌మిష‌న్ కార్యాల‌యం ఎదుట‌ వీహెచ్‌పీ (VHP) కార్య‌క‌ర్త‌లు భారీ నిర‌స‌న తెలిపారు. బారీకేడ్లు నెట్ట‌కుని లోప‌లికి వెళ్లేందుకు ప్ర‌య‌త్నించారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త ప‌రిస్థితులు త‌లెత్తాయి. దీంతో ఎలాంటి అవాంఛ‌నీయ ఘ‌ట‌న‌లు చోటుచేసుకోకుండా పోలీసులు (Police) ప‌టిష్ట బందోబ‌స్తు ఏర్పాటు చేశారు.

బంగ్లాదేశ్‌లోని మ‌య‌మ‌న్‌సింగ్ జిల్లాలో దీపూచంద్ర‌దాస్ (25)పై గ‌త వారం దాడి చేసిన దుండ‌గులు అత‌డిని చిత్ర‌హింస‌ల‌కు గురిచేసి, చెట్టుకు వేలాడ‌దీసి ఉరివేశారు. అనంత‌రం ర‌హ‌దారి ప‌క్క‌న ప‌డేయ‌గా, అత‌డి మృత‌దేహానికి కొంత‌మంది నిప్పు పెట్టారు. ఈ ఘ‌ట‌న‌ను ప్ర‌పంచ‌వ్యాప్తంగా అన్ని దేశాలు ఖండించారు. మైనార్టీల‌ను ర‌క్షించేందుకు అవ‌స‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అమెరికా చ‌ట్ట‌స‌భ స‌భ్యులు బంగ్లాదేశ్‌కు సూచించారు.

మ‌రోవైపు చిట్ట‌గాంగ్‌లోని భార‌త హైక‌మిష‌న్‌పై దాడి జ‌ర‌గ‌డాన్ని బంగ్లాదేశ్ నేష‌న‌లిస్ట్ పార్టీ నేత అమీర్ ఖ‌స్రు తీవ్రంగా ఖండించారు. దీనిని నియంత్రించ‌డంలో బంగ్లా తాత్కాలిక సార‌థి మ‌హ‌మ్మ‌ద్ యూన‌స్ విఫ‌ల‌మ‌య్యార‌ని ఆరోపించారు. రానున్న ఫిబ్ర‌వ‌రి 12న ఆ దేశంలో ఎన్నిక‌లు జ‌రుగ‌నున్నాయి.

Advertisement

తాజావార్తలు

Advertisement