త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Telangana | అమెరికాలో తెలంగాణ యువ‌తి మృతి

Telangana | అమెరికాలోని చికాగోలో తెలంగాణ‌కు చెందిన ఓ యువ‌తి రోడ్డు ప్ర‌మాదంలో ప్రాణాలు కోల్పోయింది. న‌ల్ల‌గొండ జిల్లా చెరువుగ‌ట్టు గ్రామానికి చెందిన న‌వ్య(24) ఉన్న‌త విద్య కోసం అమెరికాలోని చికాగోకు వెళ్లింది.

S

International | Published On May 18, 2026, 9.40 am IST

Telangana | అమెరికాలో తెలంగాణ యువ‌తి మృతి
Advertisement

Telangana | త్రినేత్ర‌.న్యూస్ : అమెరికాలోని చికాగోలో తెలంగాణ‌కు చెందిన ఓ యువ‌తి రోడ్డు ప్ర‌మాదంలో ప్రాణాలు కోల్పోయింది. న‌ల్ల‌గొండ జిల్లా చెరువుగ‌ట్టు గ్రామానికి చెందిన న‌వ్య(24) ఉన్న‌త విద్య కోసం అమెరికాలోని చికాగోకు వెళ్లింది. అయితే త‌న ఫ్రెండ్స్‌తో క‌లిసి ఆదివారం న‌వ్య బ‌య‌ట‌కు వెళ్లింది. వీరు ప్ర‌యాణిస్తున్న కారు రోడ్డు ప్ర‌మాదానికి గురైంది. దీంతో న‌వ్య అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోగా, మ‌రో ముగ్గురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు.

న‌వ్య చ‌నిపోయింద‌న్న విష‌యం తెలియ‌గానే ఆమె త‌ల్లిదండ్రులు, బంధువులు క‌న్నీరు పెట్టుకున్నారు. చెరువుగ‌ట్టు గ్రామంలో విషాద‌ఛాయ‌లు అలుముకున్నాయి. మృతురాలి కుటుంబానికి మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి ప్ర‌గాఢ సానుభూతి ప్ర‌క‌టించారు. వీలైనంత త్వ‌ర‌గా మృత‌దేహాన్ని గ్రామానికి ర‌ప్పించేందుకు ప్ర‌య‌త్నం చేస్తామ‌ని మంత్రి చెప్పారు.

Advertisement
Advertisement