త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Suicide Bombing | పాక్‌లో ఆత్మాహుతి దాడి.. 31 మంది మృతి

Suicide Bombing | పాకిస్థాన్ (Pakistan)లో భారీ పేలుడు సంభ‌వించింది. ఇస్లామాబాద్ (Islamabad)లోని ఓ ప్రార్థ‌నా మందిరం వెలుప‌ల ఆత్మాహుతి దాడి (Suicide Bombing) జ‌రిగింది. ఈ దాడిలో 30 మందికిపైగా మ‌ర‌ణించారు.

D

International | Published On Feb 6, 2026, 4.17 pm IST

Suicide Bombing | పాక్‌లో ఆత్మాహుతి దాడి.. 31 మంది మృతి
Advertisement

Suicide Bombing | పాకిస్థాన్ (Pakistan)లో భారీ పేలుడు సంభ‌వించింది. ఇస్లామాబాద్ (Islamabad)లోని ఓ ప్రార్థ‌నా మందిరం వెలుప‌ల ఆత్మాహుతి దాడి (Suicide Bombing) జ‌రిగింది. ఈ దాడిలో 20 మందికిపైగా మ‌ర‌ణించారు. సుమారు 169 మంది గాయ‌ప‌డ్డారు. న‌గ‌రంలోని షెహ్జాద్ టౌన్ ప్రాంతంలో ఉన్న త‌ర్లై ఇమామ్‌బ‌ర్గ్ (Tarlai Imambargah) వ‌ద్ద శుక్ర‌వారం మ‌ధ్యాహ్నం స‌మ‌యంలో ఈ పేలుడు సంభ‌వించింది.

పాక్ మీడియా నివేదిక‌ల ప్ర‌కారం.. త‌ర్లై ఇమామ్‌బ‌ర్గ్‌ ప్ర‌ధాన ద్వారం వ‌ద్ద ఈ పేలుడు సంభ‌వించింది. శుక్రవారం కావడంతో ప్రార్థనల కోసం పెద్ద సంఖ్యలో భక్తులు హాజరైన సమయంలో పేలుడు సంభవించడంతో ప్రాణ న‌ష్టం అధికంగా ఉంది. ఇప్ప‌టి వ‌ర‌కూ 31 మంది మ‌ర‌ణించిన‌ట్లు అధికారులు తెలిపారు. స‌మాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన అక్క‌డికి చేరుకొని స‌హాయక చ‌ర్య‌లు చేప‌ట్టారు. క్ష‌త‌గాత్రుల‌ను చికిత్స నిమిత్తం ఆసుప‌త్రికి త‌ర‌లించారు.

ఇది ఆత్మాహుతి దాడిగా అక్క‌డి అధికారులు అనుమానిస్తున్నారు. ఈ దాడికి ఇప్ప‌టి వ‌ర‌కూ ఏ ఉగ్ర సంస్థా బాధ్య‌త వ‌హించ‌లేదు. ఘ‌ట‌న‌పై పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు. ఈ దాడిని పాక్ అంత‌ర్గ‌త మంత్రి మొహ్సిన్ న‌ఖ్వీ తీవ్రంగా ఖండించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశాలు జారీ చేశారు.

Advertisement
Advertisement