త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Hyderabad | మాట్లాడుకుందామ‌ని పిలిచి.. యువ‌తిని కొట్టి చంపేశాడు..

వారిద్ద‌రికి ప‌బ్‌లో ప‌రిచ‌య‌మైంది. త‌ర‌చూ మాట్లాడుకునేవారు. అయితే ఇటీవ‌ల అత‌డిని కొంచం దూరం పెట్టింది. దీంతో అనుమానం పెంచుకున్న అత‌డు.. మాట్లాడుకుందామ‌ని పిలిచి ఆ యువ‌తిని దారుణంగా హ‌త్య‌చేశాడు.

G

Hyderabad | Published On Jan 12, 2026, 12.27 pm IST

Hyderabad | మాట్లాడుకుందామ‌ని పిలిచి.. యువ‌తిని కొట్టి చంపేశాడు..
Advertisement

త్రినేత్ర‌.న్యూస్‌: వారిద్ద‌రికి ప‌బ్‌లో ప‌రిచ‌య‌మైంది. త‌ర‌చూ మాట్లాడుకునేవారు. అయితే ఇటీవ‌ల అత‌డిని కొంచం దూరం పెట్టింది. దీంతో అనుమానం పెంచుకున్న అత‌డు.. మాట్లాడుకుందామ‌ని పిలిచి ఆ యువ‌తిని దారుణంగా హ‌త్య‌చేశాడు. ఈ ఘ‌ట‌న హైద‌రాబాద్‌లోని (Hyderabad) బోర‌బండలో చోటుచేసుకున్న‌ది.

బోర‌బండ‌కు చెందిన జ‌హీర్‌.. ప్ర‌స్తుతం జ్యూస్ సెంట‌ర్‌లో ప‌నిచేస్తున్నాడు. ప‌బ్‌లో ప‌నిచేస్తున్న స‌మ‌యంలో ఖ‌నీజ్ ఫాతిమా అనే యువ‌తితో ప‌రియం ఏర్ప‌డింది. ఇటీవ‌ల ఆమె మ‌రో ప‌బ్‌లో ఉద్యోగంలో చేరింది. దీంతో ఆమెపై అనుమానం పెంచుకున్న జ‌హీర్‌.. మాట్లాడుకుందామ‌ని పిలిచాడు. ఎర్ర‌గ‌ట మెంట‌ల్ హాస్పిట‌ల్ వెనుక నిర్మానుష్య ప్ర‌దేశానికి ఆమెను తీసుకెళ్లాడు.

త‌న‌తో మాట్లాడటం లేద‌ని క‌క్ష పెంచుకున్న అత‌డు.. ఆ యువ‌తిని చంపేందుకు య‌త్నించాడు. ఆమె ప్ర‌తిఘ‌టించ‌డంతో బండ‌రాయితో కొట్టి చంపేశాడు. అనంత‌రం ప‌క్క‌నే ఉన్న ఉస్తీకి వెళ్లి విష‌యం చెప్పాడు. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని మృత‌దేహాన్ని స్వాదీనం చేసుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. మరో యువకుడికి దగ్గరగా ఉండటంతో పగ పెంచుకున్న నిందితుడు.. ఈ దారుణానికి ఒడిగట్టాడని పోలీసులు తెలిపారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదుచేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు. అయితే ఒక్క‌డే ఈ హ‌త్య చేశాడా లేదా దీనివెనుక మ‌రెవ‌రి పాత్ర అయినా ఉందా? అని ఆరాతీస్తున్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement