త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Wine Shops | రేపు మ‌ల్కాజ్‌గిరి ప‌రిధిలో మ‌ద్యం షాపులు బంద్

Wine Shops | శ్రీరామ‌న‌వ‌మి వేడుక‌ల నేప‌థ్యంలో మ‌ల్కాజ్‌గిరి క‌మిష‌న‌రేట్ ప‌రిధిలో మ‌ద్యం షాపులు మూసివేయాల‌ని పోలీసులు ఉత్త‌ర్వులు జారీ చేశారు. మ‌ద్యంతో పాటు క‌ల్లు దుకాణాలు, బార్లు కూడా మూసివేయాల‌ని ఉత్త‌ర్వుల్లో పేర్కొన్నారు.

S

Hyderabad | Published On Mar 26, 2026, 5.55 pm IST

Wine Shops | రేపు మ‌ల్కాజ్‌గిరి ప‌రిధిలో మ‌ద్యం షాపులు బంద్
Advertisement

Wine Shops | త్రినేత్ర‌.న్యూస్ : శ్రీరామ‌న‌వ‌మి వేడుక‌ల నేప‌థ్యంలో మ‌ల్కాజ్‌గిరి క‌మిష‌న‌రేట్ ప‌రిధిలో మ‌ద్యం షాపులు మూసివేయాల‌ని పోలీసులు ఉత్త‌ర్వులు జారీ చేశారు. మ‌ద్యంతో పాటు క‌ల్లు దుకాణాలు, బార్లు కూడా మూసివేయాల‌ని ఉత్త‌ర్వుల్లో పేర్కొన్నారు. మార్చి 26న ఉద‌యం 10 గంట‌ల నుంచి రాత్రి 10 గంట‌ల వ‌ర‌కు మ‌ద్యం, క‌ల్లు దుకాణాల‌తో పాటు బార్లు మూసి ఉంచాల‌ని ఆదేశించారు.

నిబంధ‌న‌ల‌ను ఉల్లంఘించే వారిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని మ‌ల్కాజ్‌గిరి పోలీసు క‌మిష‌న‌ర్ అవినాష్ మహంతి హెచ్చ‌రించారు. అక్ర‌మంగా మ‌ద్యం అమ్మ‌కాలు జ‌రిపితే త‌మ దృష్టికి తీసుకురావాల‌ని సూచించారు. ఇక శ్రీరామ‌న‌వ‌మి వేడుక‌ల నేప‌థ్యంలో ఎలాంటి అవాంఛ‌నీయ ఘ‌ట‌న‌లు చోటు చేసుకోకుండా చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని సీపీ తెలిపారు.

Advertisement

తాజావార్తలు

Advertisement