త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Uttam Kumar Reddy |పాలమూరు ప్రాజెక్టుకు ఏ అనుమ‌తులూ లేవు. కేసీఆర్ వి అన్నీ అబ‌ద్ధాలే

45 టీఎంసీకి ఒప్పుకున్నారు అనేది అవాస్తవం... హరీష్ తెలివితో మాయమాటలు చెప్తున్నారు. హరీష్ రావు విచిత్ర, వికారం మాటలను ఖండిస్తున్నాం. కేసీఆర్ ప్రభుత్వానికి పాలమూరు కట్టాలని లేదు.

J

Hyderabad | Published On Dec 23, 2025, 7.42 pm IST

Uttam Kumar Reddy |పాలమూరు ప్రాజెక్టుకు ఏ అనుమ‌తులూ లేవు. కేసీఆర్ వి అన్నీ అబ‌ద్ధాలే
Advertisement

Uttam Kumar Reddy | తెలంగాణ నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మంగళవారం సచివాలయంలో జరిగిన ప్రెస్ మీట్‌లో పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్‌పై గత ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టారు.

పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్ కు గత ప్రభుత్వం 27 వేల కోట్లు ఖర్చు చేసి ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వలేదన్నారు. బీఆర్ఎస్ నాయకులు దుర్మార్గంగా బరితెగించి అబద్దాలు చెప్తున్నారన్నారు. పాలమూరు ప్రాజెక్ట్ కోసం రెండేళ్లలో తమ ప్రభుత్వం 7 వేల కోట్లు ఖర్చు చేసిందన్నారు. పాలమూరు ప్రాజెక్ట్ కోసం ఏ అనుమతులు లేవు.. కేసీఆర్ అబద్ధాలు చెప్పారన్నారు.

45 టీఎంసీకి ఒప్పుకున్నారు అనేది అవాస్తవం... హరీష్ తెలివితో మాయమాటలు చెప్తున్నారు. హరీష్ రావు విచిత్ర, వికారం మాటలను ఖండిస్తున్నాం. కేసీఆర్ ప్రభుత్వానికి పాలమూరు కట్టాలని లేదు. 2020లో సెంట్రల్ కు పంపిన నీటి వాటాల పంపకాల్లో పాలమూరు, SLBC, డిండికి నీళ్లు అడుగలేదు.

పదేళ్లలో బీఆర్ఎస్ తెలంగాణ ప్రజలను మోసం చేసింది. 1.83 లక్షల కోట్లు ఇరిగేషన్ కు ఖర్చు చేశామని చెబుతున్న బీఆర్ఎస్ పాలనలో ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కట్టిన ప్రాజెక్టలతోనే నీళ్లను పంపిణి చేశారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పేరుతో ఏపీ నీటి దోపిడీకి కేసీఆర్ సహకరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పనులను నిలిపివేశాం. వచ్చే మూడేళ్లలో ఎస్ఎల్‌బీసీ ప్రాజెక్ట్ పూర్తి చేస్తామని హామీ ఇస్తున్న. మా ప్రభుత్వంలో పాలమూరుకు ఖర్చు చేసిన 7 వేల కోట్ల లెక్కలు చెప్తం. హరీష్ రావు కమిషన్లు అంటున్నారు.. మీ అలవాట్లు మాకు లేవు. ఏదో అద్భుతాలు చేసినట్లు కేసీఆర్ ఫ్యామిలీ వ్యాఖ్యలు ఉంటాయి. అసెంబ్లీలో పీపీటీ అవకాశం నిబంధనల ప్రకారం నడుస్తుంది. అంతే కానీ ఆంధ్రా వాళ్లకు కాంట్రాక్టులు ఇచ్చామంటూ అవాకులు చెవాకులు పేలొద్దంటూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement

తాజావార్తలు

Advertisement