త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Hyderabad | హైదరాబాద్‌లో విషాదం.. రైలు కిందపడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య

Hyderabad | హైద‌రాబాద్‌లో (Hyderabad) విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మ‌హ‌త్య (Suicide) చేసుకున్నారు. కుమార్తెతో క‌లిసి దంప‌తులు బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డ్డారు.

G

Hyderabad | Published On Jan 31, 2026, 12.43 pm IST

Hyderabad | హైదరాబాద్‌లో విషాదం.. రైలు కిందపడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య
Advertisement

త్రినేత్ర‌.న్యూస్‌: హైద‌రాబాద్‌లో (Hyderabad) విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మ‌హ‌త్య (Suicide) చేసుకున్నారు. ఓ త‌ల్లి త‌న ఇద్ద‌రు పిల్ల‌ల‌తో క‌లిసి బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డ్డారు.

శ‌నివారం తెల్ల‌వారుజామున బోడుప్పల్ హరితహారం కాలనీకి చెందిన ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చర్లపల్లి–ఘట్‌కేసర్ రైల్వే స్టేషన్ల మధ్య రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. తెల్ల‌వారుజామున 2.30 గంట‌ల‌కు రైల్వే ట్రాక్‌పై మృత‌దేహాల‌ను చూసిన గూడ్స్‌రైలు లోకోపైల‌ట్ స‌మాచారం ఇవ్వ‌డంతో విష‌యం వెలుగులోకి వ‌చ్చింది.

స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్నారు. మృతులను పిన్నింటి విజ‌యశాంతి, కుమార్తె చేతన‌ రెడ్డిగా, కుమారుడు విశాల్‌గా గుర్తించారు. చేత‌న ఇంట‌ర్ రెండో ఏడాది చ‌దువుతుండ‌గా, విశాల్ ఇంట‌ర్ ఫ‌స్ట్ ఇయ‌ర్ చ‌దువుతున్నాడు. మృతుల వద్ద ఎలాంటి ప్రయాణ టికెట్లు లభించలేదు. మృతదేహాలను గాంధీ ద‌వాఖాన‌ తరలించారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదుచేసిన‌ రైల్వే పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజావార్తలు

Advertisement