త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

MMTS | శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు ఎంఎంటీఎస్.. మ‌ళ్లీ తెర‌పైకి డిమాండ్

MMTS | రాష్ట్ర రాజ‌ధాని హైద‌రాబాద్ న‌గ‌రానికి కూత‌వేటు దూరంలో ఉన్న శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు మెట్రో రైల్ మార్గాన్ని అనుసంధానించ‌డం మంచి విష‌య‌మే. కానీ ఎంఎంటీఎస్‌ను కూడా ఎయిర్‌పోర్టు వ‌ర‌కు తీసుకెళ్లాల‌ని మ‌ళ్లీ తెర‌పైకి డిమాండ్ వ‌చ్చింది.

S

Hyderabad | Published On Jan 20, 2026, 6.00 pm IST

MMTS | శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు ఎంఎంటీఎస్.. మ‌ళ్లీ తెర‌పైకి డిమాండ్
Advertisement

MMTS | త్రినేత్ర‌.న్యూస్ : రాష్ట్ర రాజ‌ధాని హైద‌రాబాద్ న‌గ‌రానికి కూత‌వేటు దూరంలో ఉన్న శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు మెట్రో రైల్ మార్గాన్ని అనుసంధానించ‌డం మంచి విష‌య‌మే. కానీ ఎంఎంటీఎస్‌ను కూడా ఎయిర్‌పోర్టు వ‌ర‌కు తీసుకెళ్లాల‌ని మ‌ళ్లీ తెర‌పైకి డిమాండ్ వ‌చ్చింది. ఉందాన‌గ‌ర్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టు వ‌ర‌కు 6 కిలోమీట‌ర్ల మేర భూమిని కేటాయించాల‌ని ఇటు కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని, అటు జీఎంఆర్‌ను ట్రావెల‌ర్స్ అసోసియేష‌న్ ప్ర‌తినిధులు డిమాండ్ చేశారు. ఎంఎంటీఎస్ రైలు మార్గానికి భూమిని కేటాయిస్తే కేవ‌లం ఆరు నెల‌ల కాలంలోనే ప‌నులు పూర్తై రైలు మార్గం అందుబాటులోకి వ‌స్తుంద‌న్నారు. హైద‌రాబాద్ న‌గ‌రంలోని ఏ మూలనుంచైనా.. ఎయిర్‌పోర్టుకు రూ. 5 నుంచి రూ. 30 ఛార్జీతో సుల‌భంగా చేరుకోవ‌చ్చ‌ని తెలిపారు.

ప్ర‌స్తుతం శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి న‌గ‌రంతో పాటు ఇత‌ర ప్రాంతాల‌కు వెళ్లే ప్ర‌యాణికులు బ‌స్సులు లేదా ప్ర‌యివేటు వాహ‌నాల‌ను ఆశ్ర‌యిస్తున్నారు. వీటికి భారీగా రుసుం చెల్లించుకోవాల్సి వ‌స్తుంది. కాబ‌ట్టి ఎంఎంటీఎస్ రైలు మార్గాన్ని ఉందాన‌గ‌ర్ నుంచి ఎయిర్‌పోర్టు వ‌ర‌కు అనుసంధానిస్తే ప్ర‌యాణికుల‌కు ఎంతో మేలు జ‌రుగుతుంద‌న్నారు.

2014లో ప్ర‌తిపాద‌న‌

2014లో ఎంఎంటీఎస్ రెండో ద‌శ ప్రారంభ‌మైంది. నాడు విమాన ప్ర‌యాణికుల ర‌ద్దీని దృష్టిలో ఉంచుకుని ఉందాన‌గ‌ర్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టు వ‌ర‌కు ఎంఎంటీఎస్‌ను విస్త‌రించాల‌ని నిర్ణ‌యించిన‌ప్ప‌టికీ.. జీఎంఆర్ నిర్వాహ‌కులు అనుమ‌తించ‌క‌పోవ‌డంతో ఉందాన‌గ‌ర్ వ‌ర‌కే ప‌రిమిత‌మైంది. దీంతో ఎయిర్‌పోర్టుకు 6 కిలోమీట‌ర్ల దూరంలోనే ఎంఎంటీఎస్ ఆగిపోయింది.

ఏకాభిప్రాయం కుద‌ర‌క‌పోవ‌డంతోనే..

భవిష్యత్తులో భూముల అవసరం ఉంటుందని, రైల్వే స్టేషన్ నిర్మిస్తే సమస్యలు వస్తాయని జీఎంఆర్ సంస్థ వాదించడంతో ప్రాజెక్ట్ ఆగిపోయిందని దక్షిణ మధ్య రైల్వే అధికారులు నాడు పేర్కొన్నారు. ముఖ్యంగా.. భూసేకరణ, ఇతర అంశాలపై ఏకాభిప్రాయం కుదరకపోవడంతో పనుల్లో పురోగతి కనిపించలేదు. భవిష్యత్తులో ఈ మార్గం అందుబాటులోకి వస్తే.. హైదరాబాద్ ప్రజలకు ఒక సురక్షితమైన, చవకైన, సులభమైన ప్రయాణ మార్గం అందుబాటులోకి రానుంది.

Advertisement

తాజావార్తలు

Advertisement