త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Tata Madhu and Naveen Kumar Reddy | నాంపల్లి కోర్టులో పోలీసులకు ఎదురుదెబ్బ: తాత మధు, నవీన్ రెడ్డి రిమాండ్ తిరస్కరణ.. పూచీకత్తుపై విడుదల

స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యల కేసులో అరెస్టైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి కోర్టులో ఊరట లభించింది. రిమాండ్‌ను తిరస్కరిస్తూ న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది.

J

Hyderabad | Published On Sep 8, 2026, 5.09 pm IST

Tata Madhu and Naveen Kumar Reddy | నాంపల్లి కోర్టులో పోలీసులకు ఎదురుదెబ్బ: తాత మధు, నవీన్ రెడ్డి రిమాండ్ తిరస్కరణ.. పూచీకత్తుపై విడుదల
Advertisement
  • బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ రెడ్డిల రిమాండ్‌ను తిరస్కరించిన నాంపల్లి కోర్టు
  • రూ.10,000 పూచీకత్తు, ఇద్దరు వ్యక్తుల ష్యూరిటీతో విడుదల చేయాలని ఆదేశం
  • స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న కేసులో మంగళవారం ఉదయం ఇరువురు నేతల అరెస్ట్
  • అరెస్ట్ ప్రక్రియలో పోలీసులు నిబంధనలు ఉల్లంఘించారన్న బీఆర్ఎస్ లీగల్ టీమ్ వాదనలతో ఏకీభవించిన కోర్టు

Tata Madhu and Naveen Kumar Reddy | త్రినేత్ర.న్యూస్ : తెలంగాణ శాసనసభ వద్ద ఉద్రిక్తతలు, స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యల కేసులో అరెస్టైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ కుమార్ రెడ్డిలకు నాంపల్లి కోర్టులో (Nampally Court) భారీ ఊరట లభించింది. ఈ కేసులో పోలీసులు దాఖలు చేసిన రిమాండ్ పిటిషన్‌ను న్యాయస్థానం తోసిపుచ్చింది. అధికార పక్షానికి, పోలీసు శాఖకు ఇది ఊహించని ఎదురుదెబ్బగా మారింది.

అరెస్ట్, ఆరోపణలు..

సోమవారం అసెంబ్లీ ముట్టడి సందర్భంగా స్పీకర్‌ను కులం పేరుతో, అసభ్య పదజాలంతో దూషించారంటూ స్పీకర్ ఓఎస్డీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వీరిద్దరిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సహా పలు సెక్షన్ల కింద సైఫాబాద్ పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 8 మంగళవారం ఉదయం ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో తాతా మధును, కోకాపేట నివాసంలో నవీన్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

కోర్టులో లీగల్ టీమ్ వాదనలు

పోలీసుల రిమాండ్ రిక్వెస్ట్‌ను బీఆర్ఎస్ లీగల్ టీమ్ (Legal Team) తీవ్రంగా వ్యతిరేకించింది. సోమవారం నాటి ఘటనకు సంబంధించిన దృశ్యాలను కోర్టు ముందు ఉంచారు. కేవలం రాజకీయ కక్షసాధింపులో భాగంగానే ఈ కేసులు నమోదు చేశారని, అరెస్ట్ ప్రక్రియలో పోలీసులు నిబంధనలను ఉల్లంఘించి ప్రాథమిక హక్కులకు భంగం కలిగించారని న్యాయవాదులు వాదించారు. ఇరుపక్షాల వాదనలు, ఆధారాలను పరిశీలించిన న్యాయమూర్తి.. పోలీసుల వాదనను తిరస్కరించారు.

జడ్జి నివాసం వద్ద హైడ్రామా

అంతకుముందు, అరెస్టైన ఎమ్మెల్సీలను పోలీసులు నేరుగా జడ్జి నివాసానికి తీసుకెళ్లడం పట్ల బీఆర్ఎస్ లాయర్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో వారిని కోర్టుకే తీసుకురావాలని జడ్జి పోలీసులకు సూచించారు. అనంతరం కోర్టులో జరిగిన విచారణలో, పది వేల రూపాయల పూచీకత్తుతో పాటు (Surety) ఇద్దరు వ్యక్తుల ష్యూరిటీలు సమర్పించాలని ఆదేశిస్తూ.. వారిని వెంటనే విడుదల చేయాలని న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఎమ్మెల్సీల విడుదల ప్రక్రియ వేగవంతమైంది.

Advertisement
Advertisement