త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kavitha | జ‌య‌శంక‌ర్ సార్ విగ్ర‌హం పెట్ట‌డం చారిత్ర‌క అవ‌స‌రం.. అనుమ‌తివ్వండి: క‌విత విజ్ఞ‌ప్తి

Kavitha | తెలంగాణ సిద్ధాంత క‌ర్త ప్రొఫెస‌ర్ దివంగ‌త కొత్త‌ప‌ల్లి జ‌య‌శంక‌ర్ విగ్ర‌హం హైదరాబాదులో అధికారికంగా కొలువు తీరడం ఒక చారిత్రక అవసరమ‌ని తెలంగాణ ర‌క్ష‌ణ సేన చీఫ్ క‌ల్వ‌కుంట్ల క‌విత అన్నారు. వారి విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి తెలంగాణ జాగృతి సంస్థకు అనుమతినివ్వాలని విజ్ఞ‌ప్తి చేశారు.

S

Hyderabad | Published On Jun 1, 2026, 12.36 pm IST

Kavitha | జ‌య‌శంక‌ర్ సార్ విగ్ర‌హం పెట్ట‌డం చారిత్ర‌క అవ‌స‌రం.. అనుమ‌తివ్వండి: క‌విత విజ్ఞ‌ప్తి
Advertisement

Kavitha | త్రినేత్ర‌.న్యూస్: తెలంగాణ సిద్ధాంత క‌ర్త ప్రొఫెస‌ర్ దివంగ‌త కొత్త‌ప‌ల్లి జ‌య‌శంక‌ర్ విగ్ర‌హం హైదరాబాదులో అధికారికంగా కొలువు తీరడం ఒక చారిత్రక అవసరమ‌ని తెలంగాణ ర‌క్ష‌ణ సేన చీఫ్ క‌ల్వ‌కుంట్ల క‌విత అన్నారు. ట్యాంక్ బండ్ పైన వారి విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి తెలంగాణ జాగృతి సంస్థకు అనుమతినివ్వాలని సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞ‌ప్తి చేశారు. ఈమేర‌కు సోమ‌వారం ఆమె సీఎంను ఎక్స్ వేదిక‌గా కోరారు.

సార్ స్ఫూర్తితో ముందుకు సాగుతున్న జాగృతి ఇప్ప‌టికే నాలుగు జిల్లా కేంద్రాల్లో వారి విగ్ర‌హాల‌ను ఏర్పాటు చేసి గౌర‌వించుకుంది. 2017లోనూ గ‌త ప్ర‌భుత్వాన్ని ఇదే విష‌య‌మై విన్న‌వించినా స‌రైన స్పంద‌న రాలేదు. మ‌హ‌నీయుల‌ను గౌర‌వించుకోవ‌డం అంటే మ‌న చ‌రిత్ర‌ను మ‌నం గౌర‌వించుకోవ‌డ‌మే అని క‌విత పేర్కొన్నారు.

తెలంగాణ ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు ప్రత్యేక రాష్ట్రమే ఏకైక పరిష్కారమని నమ్మి తుదికంటా తండ్లాడిన మహోన్నత వ్యక్తి ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్‌. తెలంగాణ వచ్చిన తర్వాత అంతటి మహనీయుని కాంస్య విగ్రహాన్ని తెలంగాణ ప్రభుత్వం ఈ 12 ఏళ్లలో అధికారికంగా ఏర్పాటు చేసుకోలేకపోవడం దురదృష్టకరం. జయశంకర్ సార్ విగ్రహ ఏర్పాటుతో విగ్రహ ప్రాంగణం గ్రీనరీ నిర్వహణ కూడా త‌మ‌ సంస్థ పక్షాన చూసుకుంటాం. సార్ జయంతి అయిన ఆగస్ట్ 6 నాటికి విగ్రహ ఏర్పాట్లు పూర్తి అయ్యేలా తగు చర్యలు తీసుకోండి అని ఆమె ప్ర‌భుత్వాన్ని కోరారు.

Advertisement
Advertisement