త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Earth Hour | ఎర్త్ అవర్‌కు జీహెచ్ఎంసీ పిలుపు! రాత్రికి గంట పాటు లైట్లు ఆఫ్..!!

Earth Hour | పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంపొందించేందుకు ప్రపంచవ్యాప్తంగా నిర్వహించే ‘ఎర్త్ అవర్ 2026’ కార్యక్రమంలో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ నగరం కూడా సిద్ధమవుతోంది.

S

Hyderabad | Published On Mar 28, 2026, 9.17 am IST

Earth Hour | ఎర్త్ అవర్‌కు జీహెచ్ఎంసీ పిలుపు! రాత్రికి గంట పాటు లైట్లు ఆఫ్..!!
Advertisement

Earth Hour | త్రినేత్ర‌.న్యూస్ : పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంపొందించేందుకు ప్రపంచవ్యాప్తంగా నిర్వహించే ‘ఎర్త్ అవర్ 2026’ కార్యక్రమంలో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ నగరం కూడా సిద్ధమవుతోంది. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఎర్త్ అవర్ 2026 కార్యక్రమంలో నగర ప్రజలు పాల్గొనాలని జీహెచ్ఎంసీ పిలుపునిచ్చింది. ఈ నెల 28న రాత్రి 8.30 గంటల నుంచి 9.30 గంటల వరకు అవసరం లేని విద్యుత్ దీపాలను స్వచ్ఛందంగా ఆఫ్ చేసి పర్యావరణ పరిరక్షణకు తోడ్పడాలని నగర పౌరులను కోరింది.

#GiveAnHourForEarth నినాదంతో నిర్వహించే ఈ కార్యక్రమం ద్వారా చిన్న చర్యలే పెద్ద మార్పులకు దారితీస్తాయని జీహెచ్ఎంసీ పేర్కొంది. పచ్చదనం పెంపు, పర్యావరణ హిత కార్యక్రమాల అమలు, నగర స్థిరమైన అభివృద్ధి దిశగా జీహెచ్ఎంసీ చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించింది. వాతావరణ మార్పులకు ప్రతిస్పందించే నగరంగా హైదరాబాద్‌ను అభివృద్ధి చేసే దిశగా కృషి చేస్తున్నట్లు తెలిపింది.

ఈ సందర్భంగా కమిషనర్ ఆర్వీ కర్ణన్‌ మాట్లాడుతూ.. ప్రతి చిన్న చర్యకు విలువ ఉంది. ధరిత్రి కోసం ఒక గంట కేటాయించడం ద్వారా గొప్ప మార్పుకు శ్రీకారం చుట్టగలం అని పేర్కొన్నారు. గ్రేటర్ హైదరాబాద్ నగర ప్రజలు, సంస్థలు, విద్యాసంస్థలు ఈ గ్లోబల్ ఉద్యమంలో స్వచ్ఛందంగా పాల్గొనాలని కమిషనర్ పిలుపునిచ్చారు.

Advertisement

తాజావార్తలు

Advertisement