త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Temple Robbery | గూగుల్‌లో వెతికి మ‌రీ.. వెంక‌టేశ్వ‌ర ఆల‌యంలో చోరీ

Temple Robbery | మారుతున్న టెక్నాల‌జీకి అనుగుణంగా దొంగ‌లు కూడా అప్‌డేట్ అవుతున్నారు. సాంకేతిక ప‌రిజ్ఞానాన్ని ఉప‌యోగించి చోరీల‌కు పాల్ప‌డుతున్నారు. గూగుల్‌లో (Google) వెతికి మ‌రీ దొంగ‌త‌నాలు చేస్తున్నారు. స‌రిగ్గా ఇలాంటి ఘ‌ట‌నే హైదరాబాద్ కూకట్‌పల్లిలోని శ్రీవెంక‌టేశ్వ‌ర స్వామి ఆల‌యంలో (Temple Robbery) జ‌రిగింది.

G

Hyderabad | Published On Jan 16, 2026, 10.43 am IST

Temple Robbery | గూగుల్‌లో వెతికి మ‌రీ.. వెంక‌టేశ్వ‌ర ఆల‌యంలో చోరీ
Advertisement

త్రినేత్ర‌.న్యూస్‌: మారుతున్న టెక్నాల‌జీకి అనుగుణంగా దొంగ‌లు కూడా అప్‌డేట్ అవుతున్నారు. సాంకేతిక ప‌రిజ్ఞానాన్ని ఉప‌యోగించి చోరీల‌కు పాల్ప‌డుతున్నారు. గూగుల్‌లో (Google) వెతికి మ‌రీ దొంగ‌త‌నాలు చేస్తున్నారు. స‌రిగ్గా ఇలాంటి ఘ‌ట‌నే హైదరాబాద్ కూకట్‌పల్లిలోని శ్రీవెంక‌టేశ్వ‌ర స్వామి ఆల‌యంలో (Temple Robbery) జ‌రిగింది.

ఆల‌యానికి సంబంధించిన వివ‌రాల‌ను గూగుల్ ద్వారా తెలుసుకున్న దొంగ‌లు.. పక్కా స్కెచ్‌ వేసి పని పూర్తి చేశారు. ఈ నెల 6న‌ అర్ధరాత్రి స‌మ‌యంలో కేపీహెచ్‌బీ (KPHB Colony) సర్దార్ పటేల్ నగర్‌లోని వెంకటేశ్వర స్వామి ఆలయంలోకి చొర‌బ‌డిన దొంగ‌ల ముఠా.. గర్భగుడిలోని మూలవిరాట్‌కు అలంకరించిన సుమారు 3 తులాల బంగారు ఆభరణాలు, 15 తులాల వెండి నగలు, మూడు వెండి విగ్రహాలతో పాటు ఒక పంచలోహ విగ్రహాన్ని ఎత్తుకెళ్లారు.

మ‌రుస‌టి రోజు ఉద‌యం దేవాలయానికి వచ్చిన పూజారులు జ‌రిగిన విష‌యాన్ని పోలీసులకు తెలిపారు. దీంతో కేసు నమోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు. చోరీకి గురైన వ‌స్తువుల‌ విలువ రూ.30 నుంచి రూ.40 లక్షల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు.

ద‌ర్యాప్తులో భాగంగా పోలీసులు సీసీటీవీల‌ను జ‌ల్ల‌డ‌ప‌ట్టారు. ఘటనా స్థలం నుంచి నిందితులు వెళ్లిన మార్గాల్లో ఉన్న సుమారు 200కు పైగా సీసీ కెమెరా ఫుటేజీలను ప‌రిశీలించారు. నిందితుల‌ను కండ్లకోయకు చెందిన నీలయ్య, ఎం.మల్లికార్జున్, మోహిత్ కుమార్ సహా ఏడుగురిని గుర్తించారు. వారిలో ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ముఠా నాయ‌కుడు నీల‌య్య, మోహిత్ కుమార్ ప‌రారీలో ఉన్నార‌ని తెలిపారు.

మోహిత్ కుమార్ గూగుల్‌లో ఆలయాన్ని వెతక‌గా.. నీలయ్య, మల్లికార్జున్ చోరీకి పాల్పడ్డారని పోలీసులు వెల్ల‌డించారు. నిందితుల నుంచి రూ.26 లక్షల విలువైన బంగారు, వెండి, రాగి ఆభరణాలతో పాటు ఒక బైక్‌, 5 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నామ‌ని తెలిపారు. విగ్రహాలను ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని కాకినాడలో కరిగించి, సొమ్ము చేసుకునేందుకు ప్రయత్నించార‌న్నారు.

ప్ర‌ధాన నిందితుడు నీలయ్య గతంలో 15కు పైగా దోపిడీ కేసుల్లో పట్టుబడ్డార‌ని చెప్పారు. గ‌తేడాది నవంబర్​ 1న జైలు నుంచి విడుద‌ల‌య్యాడ‌ని వెల్ల‌డించారు. ఆ త‌ర్వాత అమీర్​పూర్​లో ఒక బైక్​ దొంగతనం కేసులో కూడా ఉన్నాడ‌న్నారు. స్థానిక పోలీసుల స‌హాయంతో నిందితుల‌ను ఔటర్​ రింగ్​ రోడ్డు దగ్గర ప‌ట్టుకున్నామ‌ని కూక‌ట్‌ప‌ల్లి సీఐ తెలిపారు.

Advertisement

తాజావార్తలు

Advertisement