త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Seethakka | ఎములాడ రాజన్న, సమ్మక్క సార‌ల‌మ్మ ఆలయాల అభివృద్ధిని ప‌ట్టించుకోని కేసీఆర్: మంత్రి సీతక్క

Seethakka | వేముల‌వాడ రాజన్న, సమ్మక్క సార‌ల‌మ్మ‌ ఆలయాలను మాజీ సీఎం కేసీఆర్ (KCR) పట్టించుకోలేదని మంత్రి సీతక్క (Seethakka) విమ‌ర్శించారు. కానీ సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) సాధార‌ణ భ‌క్తుల మ‌నోభావాల‌ను గుర్తిస్తున్నార‌ని తెలిపారు.

G

Telangana | Published On Jan 16, 2026, 11.43 am IST

Seethakka | ఎములాడ రాజన్న, సమ్మక్క సార‌ల‌మ్మ ఆలయాల అభివృద్ధిని ప‌ట్టించుకోని కేసీఆర్: మంత్రి సీతక్క
Advertisement

త్రినేత్ర‌.న్యూస్‌: వేముల‌వాడ రాజన్న, సమ్మక్క సార‌ల‌మ్మ‌ ఆలయాలను మాజీ సీఎం కేసీఆర్ (KCR) పట్టించుకోలేదని మంత్రి సీతక్క (Seethakka) విమ‌ర్శించారు. కానీ సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) సాధార‌ణ భ‌క్తుల మ‌నోభావాల‌ను గుర్తిస్తున్నార‌ని, ఇందులో భాగంగా వేముల‌వాడ‌ రాజ‌రాజేశ్వ‌ర స్వామి, స‌మ్మ‌క్క గుళ్ల‌ను అభివృద్ధి చేస్తున్నార‌ని తెలిపారు. శుక్రవారం కుటుంబ స‌మేతంగా రాజ‌న్న అనుబంధ భీమేశ్వ‌ర ఆల‌యంలో స్వామివారిని ద‌ర్శించుకుని ప్ర‌త్యేక పూజ‌లు చేశారు. శ్రీ బద్ది పోచమ్మ అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే, ప్ర‌భుత్వ విప్ ఆది శ్రీనివాస్‌తో క‌లిసి మీడియాతో మాట్లాడుతూ.. వేముల‌వాడ రాజ‌న్న ఆల‌య అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టార‌న్నారు. అలాగే మేడారం సమ్మక్క సారలమ్మ గుడి నిర్మాణంను గొప్పగా చేస్తున్నారని తెలిపారు. సమ్మక్క జాతర నేపథ్యంలో ముందుగా వేములవాడలో స్వామి వారిని దర్శనం చేసుకొని మొక్కులు చెల్లించుకున్నానని వెల్ల‌డించారు.

వేములవాడ రాజన్న, సమ్మక్క సారలమ్మను ఎక్కువగా పేద ప్రజలు దర్శించుకుంటారని.. కానీ ఇటీవల ఉన్నత వర్గాల వారు కూడా వస్తున్నారన్నారని చెప్పారు. నాలుగు రోజుల పాటు మేడారం జాతరను వైభవంగా నిర్వహిస్తామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సాధారణ భక్తుల మనోభావాలను గుర్తిస్తున్నారని చెప్పారు.

గతంలో రాజన్న ఆల‌యాన్ని అభివృద్ధి చేయవద్దని దుష్ప్రచారాలు చేశారని.. కానీ భక్తుల మనోభావాలను గుర్తించి సీఎం రేవంత్ గుడిని డెవ‌ల‌ప్ చేస్తున్నారని తెలిపారు. వేముల‌వాడ‌లో భ‌క్తుల‌కు మ‌రిన్ని సౌక‌ర్యాలు క‌ల్పించాల్సి ఉంద‌న్నారు. ఆల‌యాల అభివృద్ధి భావోద్వేగాలు, ఆచారాల‌తో ముడిప‌డి ఉంద‌ని పేర్కొన్నారు. ఈ నెల‌ 18న మేడారంలో కేబినెట్ మీటింగ్ జ‌రుగుతుందని వెల్ల‌డించారు. 19న సమ్మక్క సారలమ్మ గుడిని సీఎం పునః ప్రారంభింస్తార‌ని తెలిపారు. పుష్కరాల నేప‌థ్యంలో గోదావ‌రి ప‌రివాహ‌క ప్రాంత అభివృద్ధికి ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకుంటుంద‌ని వెల్ల‌డించారు.

Advertisement

తాజావార్తలు

Advertisement