త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Hyderabad | పిల్లి మ‌ర‌ణం త‌ట్టుకోలేక‌.. డిగ్రీ విద్యార్థిని ఆత్మ‌హ‌త్య‌

Hyderabad | కొంద‌రు పెంపుడు జంతువుల‌ను ఎంతో ఇష్టంగా పెంచుకుంటారు. వాటికి ఏమ‌న్న జ‌రిగితే త‌ట్టుకోలేరు. పెంపుడు పిల్లి మ‌ర‌ణించింద‌ని చెప్పి.. ఓ విద్యార్థిని పురుగుల మందు తాగి ఆత్మ‌హ‌త్య చేసుకుంది.

S

Hyderabad | Published On Mar 19, 2026, 5.24 pm IST

Hyderabad | పిల్లి మ‌ర‌ణం త‌ట్టుకోలేక‌.. డిగ్రీ విద్యార్థిని ఆత్మ‌హ‌త్య‌
Advertisement

Hyderabad | త్రినేత్ర‌.న్యూస్ : కొంద‌రు పెంపుడు జంతువుల‌ను ఎంతో ఇష్టంగా పెంచుకుంటారు. వాటికి ఏమ‌న్న జ‌రిగితే త‌ట్టుకోలేరు. పెంపుడు పిల్లి మ‌ర‌ణించింద‌ని చెప్పి.. ఓ విద్యార్థిని పురుగుల మందు తాగి ఆత్మ‌హ‌త్య చేసుకుంది. ఈ ఘ‌ట‌న హైద‌రాబాద్ న‌గ‌రంలోని బడంగ్‌పేట్‌లో చోటు చేసుకుంది.

వివ‌రాల్లోకి వెళ్తే.. బడంగ్‌పేట్‌కు చెందిన బ‌ట్ట హిమ‌బిందు(20) డిగ్రీ ఫ‌స్టియ‌ర్ చ‌దువుతోంది. అయితే గ‌త రెండు సంవ‌త్స‌రాల నుంచి ఆమె పిల్లిని పెంచుకుంటుంది. అనారోగ్య కార‌ణాల వ‌ల్ల ఆ పిల్లి 18న తెల్ల‌వారుజామున 4 గంట‌ల‌కు చ‌నిపోయింది. ఇక పిల్లి మ‌ర‌ణించ‌డంతో.. హిమ‌బిందు తీవ్ర మ‌న‌స్తాపానికి గురైంది. బోరున విల‌పించింది.

పెంపుడు పిల్లి మ‌ర‌ణాన్ని త‌ట్టుకోలేక‌.. హిమ‌బిందు అదే రోజు పురుగుల మందు తాగి ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డింది. 18న ఉద‌యం 4.40 గంట‌ల‌కు హిమ‌బిందు సూసైడ్ చేసుకున్న‌ట్లు ఆమె సోద‌రుడు పోలీసుల‌కు తెలిపాడు. మా సోద‌రి మ‌ర‌ణంపై త‌మ‌కు ఎలాంటి అనుమానం లేదు.. పిల్లి చ‌నిపోయింద‌ని తీవ్ర మ‌న‌స్తాపానికి గురై ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డింద‌ని ఫిర్యాదులో పేర్కొన్నాడు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Advertisement

తాజావార్తలు

Advertisement