త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

SPDCL | గడువులోగా బిల్లు క‌ట్ట‌క‌పోతే క‌రెంటు క‌ట్‌..: ఎస్పీడీసీఎల్‌

SPDCL | ఇంటి ప‌న్ను చెల్లించ‌క‌పోతే క‌రెంటు క‌ట్ చేస్తామ‌ని జ‌గిత్యాల జిల్లా కోరుట్ల మున్సిపాలిటీ ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. తాజాగా ఎస్పీడీసీఎల్ (SPDCL) కూడా ఇలాంటి నిర్ణ‌యమే తీసుకున్నారు.

G

Hyderabad | Published On Mar 30, 2026, 7.58 am IST

SPDCL | గడువులోగా బిల్లు క‌ట్ట‌క‌పోతే క‌రెంటు క‌ట్‌..: ఎస్పీడీసీఎల్‌
Advertisement

SPDCL | త్రినేత్ర‌.న్యూస్‌: ఇంటి ప‌న్ను చెల్లించ‌క‌పోతే క‌రెంటు క‌ట్ చేస్తామ‌ని జ‌గిత్యాల జిల్లా కోరుట్ల మున్సిపాలిటీ ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. తాజాగా ఎస్పీడీసీఎల్ (SPDCL) కూడా ఇలాంటి నిర్ణ‌యమే తీసుకున్నారు. గడువులోగా బిల్లు కట్టనివారికి విద్యుత్‌ సరఫరా నిలిపివేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు కరెంట్‌ మీటరు రీడర్లకు లక్ష్యాలు విధించి అమలు చేసే బాధ్యతను అప్పగించారు. ప్ర‌స్తుతం నెలలో 10 రోజులు మాత్రమే మీటరు రీడర్లు పనిచేస్తుండగా మిగతా రోజుల్లో కూడా పనిచేసేందుకు వీలుగా ఈ బాధ్యతలు అప్పగించినట్లు అధికారులు వెల్ల‌డించారు. ఎస్‌పీడీసీఎల్‌లో సుమారు 15 వందల మంది మీటరు రీడర్లు ప‌నిచేస్తున్నారు. వారిలో ప్రతీ మీటరు రీడరు నెలకు వంద కనెక్షన్లను తనిఖీ చేసి కరెంట్‌ బిల్‌ కట్టకపోతే సరఫరా నిలిపివేయాల‌ని ఉత్త‌ర్వులో పేర్కొన్నారు.

ఇందులో భాగంగా మూడునెలల నుంచి కరెంట్‌ బిల్లులు కట్టకుండా ఇంటికి తాళం వేసిఉంటే నిజమా కాదా అనేది మీటరు రీడరు తనిఖీ చేయాల్సి ఉంటుంది. చాలామంది బిల్లులు చెల్లించకపోవడంతో సంస్థకు భారీనష్టం వాటిల్లుతున్నదని, లైన్‌మెన్లు కరెంట్‌ కట్‌ చేయడానికి వెళ్తే చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయని సిబ్బంది చెబుతున్నారు. ఈ నేపథ్యంలో లైన్‌మెన్ల బాధ్యతల‌ను మీటర్‌ రీడర్లకు అప్పగించడం స‌ర్వ‌త్రా చర్చనీయాంశమైంది.

Advertisement

తాజావార్తలు

Advertisement