త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Power Cut | సబ్‌స్టేషన్‌లో సాంకేతిక సమస్య.. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో ఆరు గంటలుగా క‌రెంట్ క‌ట్‌

Power Cut | మంత్రులు, అధికారులు క‌రెంటు కోత‌లు (Power Cut) లేవ‌ని చెబుతున్న‌ప్ప‌టికీ.. రాష్ట్రంలోని ప‌లు ప్రాంతాల్లో విద్యుత్ స‌ర‌ఫ‌రాకు అంత‌రాయం ఏర్ప‌డుతూనే ఉంది.

G

Hyderabad | Published On May 13, 2026, 9.17 am IST

Power Cut | సబ్‌స్టేషన్‌లో సాంకేతిక సమస్య.. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో ఆరు గంటలుగా క‌రెంట్ క‌ట్‌
Advertisement

Power Cut | త్రినేత్ర‌.న్యూస్‌: మంత్రులు, అధికారులు క‌రెంటు కోత‌లు (Power Cut) లేవ‌ని చెబుతున్న‌ప్ప‌టికీ.. రాష్ట్రంలోని ప‌లు ప్రాంతాల్లో విద్యుత్ స‌ర‌ఫ‌రాకు అంత‌రాయం ఏర్ప‌డుతూనే ఉంది. దీంతో అధిక ఉష్ణోగ్ర‌త‌లు, ఉక్క‌పోత‌తో ప్ర‌జ‌లు స‌త‌మ‌త‌మ‌వుతున్నారు. తాజాగా గ‌చ్చిబౌలిలోని (Gachibowli) ట్రాన్స్‌కో 220/130కేవీ సబ్‌స్టేషన్‌లో సాంకేతిక సమస్య ఎదురైంది. దీంతో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో (Financial District) విద్యుత్ సరఫరా నిలిచింది.

గచ్చిబౌలి, కొండాపూర్, చందానగర్, నాన‌క్‌రామ్ గూడ‌, ట్రిపుల్ ఐటీ, పాపిరెడ్డి కాలనీలో జంపర్​ కట్​ కావడంతో క‌రెంటు సరఫరా నిలిచిపోయింది. రాత్రి నుంచి డిస్కమ్- ట్రాన్స్‌కో సమన్వయంతో పనులు కొనసాగుతున్నాయి. దాదాపు ఆరు గంటలుగా విద్యుత్ లేక‌పోవడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. పీటీఆర్‌ల వారీగా సమస్యలు పరిష్కరిస్తున్నామని అధికారులు వెల్ల‌డించారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో విద్యుత్‌ను పునరుద్ధరించామన్నారు. మ‌రికొన్ని ప్రాంతాల్లో ప‌ని జరుగుతుందని, తొంద‌ర్లోనే క‌రెస్ స‌ర‌ఫ‌రా అవుతుంద‌ని చెప్పారు.

Advertisement
Advertisement