Drunken Drive | త్రినేత్ర.న్యూస్ : మరో వారం రోజుల్లో 2025 ఏడాది ముగియనుంది. ఈ క్రమంలో కొత్త ఏడాదికి స్వాగతం పలికేందుకు హైదరాబాద్ ప్రజలు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో నగర పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ కీలక ఆదేశాలు జారీ చేశారు. డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడితే రూ.10 వేలు జరిమానా, గరిష్టంగా 6 నెలల జైలు శిక్ష విధిస్తామని సీపీ సజ్జనార్ హెచ్చరించారు. రేపటి నుంచి డిసెంబర్ 30 వరకు హైదరాబాద్ వ్యాప్తంగా ప్రత్యేక ఎన్ఫోర్స్మెంట్ డ్రైవ్ చేపడుతామని తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తప్పవని తేల్చిచెప్పారు. మైనర్లు వాహనాలు నడపడం నేరం. మైనర్లకు వాహనం ఇచ్చిన యజమానులు, తల్లిదండ్రులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం అని సజ్జనార్ హెచ్చరించారు. ట్రాఫిక్ పోలీసుల ప్రధాన లక్ష్యం రోడ్డు భద్రత అని ఆయన పేర్కొన్నారు.