త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Konda Surekha former OSD | రూ.10 కోట్ల కోసం వ్యాపారిపై దాడి.. కొండా సురేఖ మాజీ OSD సుమంత్‌పై అటెంప్ట్ మర్డర్ కేసు

వ్యాపారిని కిడ్నాప్ చేసి, 10 కోట్లు డిమాండ్ చేసిన మంత్రి కొండా సురేఖ మాజీ OSD సుమంత్‌పై జూబ్లీహిల్స్ పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు.

J

Hyderabad | Published On Aug 20, 2026, 6.47 pm IST

Konda Surekha former OSD | రూ.10 కోట్ల కోసం వ్యాపారిపై దాడి.. కొండా సురేఖ మాజీ OSD సుమంత్‌పై అటెంప్ట్ మర్డర్ కేసు
Advertisement
  • మంత్రి కొండా సురేఖ మాజీ OSD సుమంత్‌, మరో ఐదుగురిపై అటెంప్ట్ మర్డర్ కేసు
  • రూ.10 కోట్లు ఇవ్వాలని వ్యాపారి గొంగడి హరికృష్ణను డిమాండ్ చేసి, ఇనుప రాడ్లతో దాడి చేసినట్లు ఫిర్యాదు
  • మొదట మేడిపల్లి పీఎస్‌లో జీరో ఎఫ్ఐఆర్, అనంతరం జూబ్లీహిల్స్ పోలీసులకు కేసు బదిలీ

Konda Surekha former OSD | త్రినేత్ర.న్యూస్ : రాష్ట్ర మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ (OSD) సుమంత్ చుట్టూ వివాదాలు ముసురుకుంటున్నాయి. తాజాగా ఓ వ్యాపారిని బెదిరించి ఏకంగా రూ.10 కోట్లు డిమాండ్ చేసిన ఘటనలో సుమంత్‌తో పాటు మరో ఐదుగురిపై జూబ్లీహిల్స్ పోలీసులు అటెంప్ట్ మర్డర్ (హత్యాయత్నం) కేసు నమోదు చేశారు.

వివరాల్లోకి వెళితే.. గొంగడి హరికృష్ణ అనే వ్యాపారిని సుమంత్ తన డెన్‌కు పిలిపించుకున్నట్లు సమాచారం. అక్కడ హరికృష్ణను ఏకంగా రూ.10 కోట్లు ఇవ్వాలని సుమంత్ డిమాండ్ చేశాడు. అయితే, అంత భారీ మొత్తం ఇచ్చేందుకు బాధితుడు నిరాకరించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఆగ్రహానికి గురైన సుమంత్, అతని అనుచరులు ఇనుప రాడ్లతో వ్యాపారిపై దారుణంగా దాడికి పాల్పడ్డారు.

తీవ్ర గాయాలపాలైన బాధితుడు హరికృష్ణ ఫిర్యాదు మేరకు మేడిపల్లి పోలీసులు ముందుగా జీరో ఎఫ్ఐఆర్ (Zero FIR) నమోదు చేశారు. క్రైమ్ జరిగిన లొకేషన్ ఆధారంగా అనంతరం ఈ కేసును జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు ట్రాన్స్‌ఫర్ చేశారు.

ప్రస్తుతం జూబ్లీహిల్స్ పోలీసులు సుమంత్‌పై సెక్షన్ 109 కింద హత్యాయత్నం కేసును ఫైల్ చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. వరుస వివాదాలతో కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్న మంత్రి మాజీ ఓఎస్డీ.. ఏకంగా అటెంప్ట్ మర్డర్ కేసులో ఇరుక్కోవడం ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ కేసులో పోలీసులు తదుపరి ఎలాంటి యాక్షన్ తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.

Advertisement
Advertisement