త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

ABVP Protest Hyderabad | పాలిటెక్నిక్ కోర్సు వ్యవధి తగ్గిస్తారా? ‘శక్తి’ జీవో 97పై భగ్గుమన్న ఏబీవీపీ

తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 97ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ SBTET కార్యాలయం ఎదుట ఏబీవీపీ (ABVP) భారీ ఆందోళన చేపట్టింది. పూర్తి వివరాలు ఇవే.

J

Hyderabad | Published On Aug 24, 2026, 6.58 pm IST

ABVP Protest Hyderabad | పాలిటెక్నిక్ కోర్సు వ్యవధి తగ్గిస్తారా? ‘శక్తి’ జీవో 97పై భగ్గుమన్న ఏబీవీపీ
Advertisement
  • హైదరాబాద్‌లోని SBTET కార్యాలయం ముందు ఏబీవీపీ (ABVP) నాయకుల భారీ ధర్నా
  • పాలిటెక్నిక్ విద్యను 3 ఏళ్ల కోర్సుగానే ఉంచాలని, లేటరల్ ఎంట్రీ కొనసాగాలని డిమాండ్
  • 'శక్తి' (Shakti) స్కీమ్ పేరుతో ప్రభుత్వం తెచ్చిన జీవో 97ను తక్షణమే వెనక్కి తీసుకోవాలని హెచ్చరిక
  • విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకోవద్దని, రాతపూర్వక హామీ ఇవ్వాలని ప్రభుత్వానికి ఏబీవీపీ నేతల అల్టిమేటం

ABVP Protest Hyderabad | త్రినేత్ర.న్యూస్ : తెలంగాణలో పాలిటెక్నిక్ (Polytechnic) విద్యార్థుల భవిష్యత్తును అయోమయంలోకి నెట్టేలా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP) తీవ్రస్థాయిలో మండిపడింది. పాలిటెక్నిక్ విద్యను యథాతథంగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్‌లోని స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ (SBTET) కార్యాలయం ఎదుట ఏబీవీపీ నాయకులు భారీ ధర్నాకు దిగారు.

3 ఏళ్ల కోర్సును 6 నెలలు చేస్తారా?

'శక్తి' (Shakti) ప్రాజెక్టు పేరుతో రాష్ట్ర ప్రభుత్వం హడావిడిగా తీసుకొచ్చిన GO No. 97 పై విద్యార్థుల్లో తీవ్ర గందరగోళం నెలకొందని ABVP గ్రేటర్ హైదరాబాద్ సిటీ సెక్రెటరీ పృథ్వి ఆరోపించారు. దశాబ్దాలుగా ఉన్న 3 ఏళ్ల పాలిటెక్నిక్ విద్యను.. కేవలం 6 నెలలు లేదా ఏడాది వ్యవధి గల ఒక సాధారణ సర్టిఫికెట్ కోర్సులాగా మార్చేందుకు జరుగుతున్న ప్రయత్నాలను ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ కొత్త విధానం వల్ల సాంకేతిక విద్యను నమ్ముకున్న గ్రామీణ విద్యార్థులు ఉన్నత చదువులకు దూరం అవుతారని ఆందోళన వ్యక్తం చేశారు.

ABVP Protest at SBTET Hyderabad Against GO 97 and Shakti Scheme

లేటరల్ ఎంట్రీ రద్దు చేయొద్దు

పాలిటెక్నిక్ పూర్తి చేసిన విద్యార్థులకు నేరుగా ఇంజనీరింగ్ సెకండియర్‌లో ప్రవేశం కల్పించే 'లేటరల్ ఎంట్రీ' (Lateral Entry) విధానాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ రద్దు చేయొద్దని ఏబీవీపీ నేతలు ప్రభుత్వానికి తేల్చిచెప్పారు. ప్రభుత్వం వెంటనే స్పందించి వివాదాస్పద జీవో 97ను వెనక్కి తీసుకోవాలని, ఈ మేరకు విద్యాశాఖ అధికారుల నుంచి రాతపూర్వక హామీ (Written assurance) ఇవ్వాలని పట్టుబట్టారు.

విద్యార్థులను భయభ్రాంతులకు గురిచేసే చర్యలు ఆపకపోతే, రాబోయే రోజుల్లో ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని ఏబీవీపీ నాయకులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ ధర్నాలో ABVP స్టేట్ జాయింట్ సెక్రెటరీలు రాజు, మహేష్, విద్యానగర్ కన్వీనర్ హరి ప్రసాద్, జిల్లా కన్వీనర్లు బుర్ర అఖిల్, సాయి తేజతో పాటు దినేష్, చంద్రకాంత్ తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Advertisement
Advertisement