త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Shamshabad Airport | శంషాబాద్‌లో భారీగా గంజాయి ప‌ట్టివేత‌..

Shamshabad Airport | త్రినేత్ర‌.న్యూస్‌: శంషాబాద్ విమానాశ్ర‌యంలో (Shamshabad Airport) భారీగా గంజాయి ప‌ట్టుబ‌డింది. కౌలాలంపూర్ నుంచి హైద‌రాబాద్ వ‌చ్చిన విమాన ప్ర‌యాణికుల‌కు క‌స్ట‌మ్స్ సిబ్బంది త‌నిఖీ చేశారు.

G

Hyderabad | Published On Mar 9, 2026, 12.32 pm IST

Shamshabad Airport | శంషాబాద్‌లో భారీగా గంజాయి ప‌ట్టివేత‌..
Advertisement

Shamshabad Airport | త్రినేత్ర‌.న్యూస్‌: శంషాబాద్ విమానాశ్ర‌యంలో (Shamshabad Airport) భారీగా గంజాయి ప‌ట్టుబ‌డింది. కౌలాలంపూర్ నుంచి హైద‌రాబాద్ వ‌చ్చిన విమాన ప్ర‌యాణికుల‌కు క‌స్ట‌మ్స్ సిబ్బంది త‌నిఖీ చేశారు. ఈ సంద‌ర్భంగా ఇద్ద‌రు ప్ర‌యాణికుల నుంచి 9 కిలోల హైడ్రోపోనిక్‌ గంజాయి (Hydroponic Ganza) స్వాధీనం చేసుకున్నారు. దాని విలువ‌ రూ.3 కోట్లు ఉంటుంద‌ని అధికారులు తెలిపారు. నిందితుల‌ను అదుపులోకి తీసుకుని ప్ర‌శ్నిస్తున్నారు. గంజాయిని ఎవ‌రికి స‌ప్ల‌య్ చేస్తున్నార‌ని, ఎక్క‌డి నుంచి తీసుకొస్తున్నార‌ని ఆరా తీస్తున్నారు.

మ‌రోవైపు భారీ సింథ‌టిక్ డ్ర‌గ్స్ రాకెట్‌ను పోలీసులు ర‌ట్టు చేశారు. షాద్‌నగర్‌లో రహస్యంగా మెఫెడ్రోన్ డ్రగ్ తయారీ చేస్తున్న గ్యాంగ్ కార్యకలాపాలను ఈగిల్ ఫోర్స్ దర్యాప్తులో గుర్తించారు. ఎస్సార్ ఇన్నోవేషన్స్ అనే సంస్థ ద్వారా డ్రగ్స్ తయారీలో ఉపయోగించే నిషేధిత రసాయనాలను సరఫరా చేస్తున్నట్టు గుర్తించారు. ముఖ్యంగా మెఫెడ్రోన్ తయారీలో ఉపయోగించే 2 బ్రోమో-4 మెథైల్ ప్రోపియోఫీనోన్ అనే రసాయనంతో పాటు, క్లోఫెడ్రోన్ తయారీలో ఉపయోగించే 3 క్లోరో-1 ఫెనైల్-1 ప్రోపనోన్ అనే కెమికల్స్‌ను సరఫరా చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ వ్యవహారంలో ఎస్సార్ ఇన్నోవేషన్స్ డైరెక్టర్ షేక్ రఫీ కీలక పాత్ర పోషించినట్టు తెలిసింది. ఇండియా మార్ట్ ద్వారా రాజస్థాన్‌కు చెందిన నిందితులకు ఈ రసాయనాలను సరఫరా చేసినట్లు వెల్ల‌డించారు. తప్పుడు కంపెనీ పేర్లతో కెమికల్స్ కొనుగోలు చేసి షాద్‌నగర్‌లో కిరాయికి గదిని తీసుకుని అక్కడే డ్రగ్స్ తయారీ చేస్తున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. తయారు చేసిన డ్రగ్స్‌ను తిరిగి రాజస్థాన్‌కు తరలించి విక్రయిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Advertisement
Advertisement