త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Shamshabad Airport | శంషాబాద్‌లో ప‌ట్టుబ‌డిన డ్రోన్లు.. మూడు రోజుల్లో రెండోసారి

hamshabad Airport | శంషాబాద్ విమానాశ్రాయంలో (Shamshabad Airport) మ‌రోసారి భారీగా డ్రోన్లు (Drones) ప‌ట్టుబ‌డ్డాయి. ఈ నెల 14న 70 డ్రోన్లు ప‌ట్టుబ‌డిన విష‌యం తెలిసిందే. తాజాగా ర‌హ‌స్యంగా త‌ర‌లిస్తున్న మ‌రో 74 డ్రోన్ల‌ను అధికారులు ప‌ట్టుకున్నారు.

G

Telangana | Published On Mar 16, 2026, 11.47 am IST

Shamshabad Airport | శంషాబాద్‌లో ప‌ట్టుబ‌డిన డ్రోన్లు.. మూడు రోజుల్లో రెండోసారి
Advertisement

Shamshabad Airport | త్రినేత్ర‌.న్యూస్‌: శంషాబాద్ విమానాశ్రాయంలో (Shamshabad Airport) మ‌రోసారి భారీగా డ్రోన్లు (Drones) ప‌ట్టుబ‌డ్డాయి. ఈ నెల 14న 70 డ్రోన్లు ప‌ట్టుబ‌డిన విష‌యం తెలిసిందే. తాజాగా ర‌హ‌స్యంగా త‌ర‌లిస్తున్న మ‌రో 74 డ్రోన్ల‌ను అధికారులు ప‌ట్టుకున్నారు.

సోమవారం ఉద‌యం సింగ‌పూర్ (Singapore) నుంచి వ‌చ్చిన ప్ర‌యాణికుల‌ను క‌స్ట‌మ్స్ అధికారులు త‌నిఖీ చేశారు. ఈ సంద‌ర్భంగా ముగ్గురి వ‌ద్ద 74 డ్రోన్లు ల‌భించాయి. దీంతో వారిని ప్ర‌శ్నించ‌గా సింగ‌పూర్ నుంచి భార‌త్‌కు తీసుకొస్తున్నట్లు తెలిపారు. వాటి విలువ రూ.42 ల‌క్ష‌లు ఉంటాయ‌ని అధికారులు వెల్ల‌డించారు. నిందితుల‌ను మ‌హ‌మ్మ‌ద్‌, తాజ్‌, అస్గ‌ర్‌గా గుర్తించారు. ముగ్గురు డ్రోన్ల‌ను సామాగ్రిలో పెట్టి వేర్వేరు విమానాల్లో శంషాబాద్ వ‌చ్చార‌ని చెప్పారు. కాగా, గ‌త శ‌నివారం (మార్చి 14న‌) రూ.50 ల‌క్ష‌ల విలువైన 70 డ్రోన్లు ప‌ట్టుబ‌డ్డాయి. దీంతో మూడు రోజుల వ్య‌వ‌ధిలోనే అక్ర‌మంగా త‌ర‌లిస్తున్న డ్రోన్లు భారీగా ల‌భించ‌డంతో అధికారులు లోతుగా విచారిస్తున్నారు. దీనివెనుక ఎవ‌రున్నార‌ని ఆరాతీస్తున్నారు.

Advertisement
Advertisement