త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Mobile Phones | దొంగిలించ‌బ‌డ్డ 34 మొబైల్ ఫోన్లు రిక‌వ‌రీ.. బాధితుల‌కు అంద‌జేత‌

Mobile Phones | బ‌స్టాండ్లు, రైల్వే స్టేష‌న్ల‌తో పాటు ర‌ద్దీ ప్రాంతాల్లో ప‌లువురు త‌మ మొబైల్ ఫోన్ల‌ను పోగొట్టుకుంటుంటారు. జేబు దొంగ‌లు క్ష‌ణాల్లోనే ఫోన్ల‌ను త‌స్క‌రించి, మాయ‌మ‌వుతుంటారు.

S

Hyderabad | Published On Aug 27, 2026, 7.32 pm IST

Mobile Phones | దొంగిలించ‌బ‌డ్డ 34 మొబైల్ ఫోన్లు రిక‌వ‌రీ.. బాధితుల‌కు అంద‌జేత‌
Advertisement

Mobile Phones | త్రినేత్ర‌.న్యూస్ : బ‌స్టాండ్లు, రైల్వే స్టేష‌న్ల‌తో పాటు ర‌ద్దీ ప్రాంతాల్లో ప‌లువురు త‌మ మొబైల్ ఫోన్ల‌ను పోగొట్టుకుంటుంటారు. జేబు దొంగ‌లు క్ష‌ణాల్లోనే ఫోన్ల‌ను త‌స్క‌రించి, మాయ‌మ‌వుతుంటారు. అయితే మైలార్‌దేవ్‌ప‌ల్లి పోలీసు స్టేష‌న్ ప‌రిధిలో ఫోన్లు పోగొట్టుకున్న బాధితులు.. ఫిర్యాదులు, సీఈఐఆర్ (సెంట్ర్ ఫర్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్) పోర్టల్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేశారు. ఈ ద‌ర‌ఖాస్తుల ఆధారంగా రూ. 5.1 లక్షల విలువైన 34 మొబైల్ ఫోన్లను మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు విజయవంతంగా స్వాధీనం చేసుకున్నారు.

దర్యాప్తులో భాగంగా, సాంకేతిక, దర్యాప్తు వనరులను సమర్థవంతంగా వినియోగించి, వివిధ ప్రాంతాలలో ఉన్న ఈ మొబైల్ ఫోన్లను పోలీస్ బృందం గుర్తించి రికవరీ చేసింది. స్వాధీనం చేసుకున్న ఫోన్లను ఫిర్యాదుదారులు అందించిన వివరాలతో సరిచూడటం జరిగింది. అన్ని చట్టపరమైన ప్రక్రియలు పూర్తయిన తర్వాత, ఆ మొబైల్ ఫోన్లను వాటి యజమానులకు సురక్షితంగా అందజేశారు.

మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్ అధికారులు, సిబ్బంది సమన్వయంతో కూడిన కృషి వల్లనే ఈ మొబైల్ ఫోన్ల రికవరీ సాధ్యమైందని పోలీసు ఉన్న‌తాధికారులు తెలిపారు. ప్రజలు తమ మొబైల్ ఫోన్లు పోయినా లేదా దొంగతనానికి గురైనా వెంటనే సమీపంలోని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని, అలాగే CEIR పోర్టల్ ద్వారా ఫోన్‌ను బ్లాక్ చేయాలని కోరడమైనది. దీనివల్ల ఫోన్లను గుర్తించి రికవరీ చేయడానికి వేగవంతమైన చర్యలు చేపట్టవచ్చు అని పోలీసు ఉన్న‌తాధికారులు సూచించారు.

Advertisement
Advertisement