త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Actor Ajith | అజిత్‌ను ప‌రామ‌ర్శించిన సీఎం విజ‌య్‌, త్రిష‌

Actor Ajith | తమిళ సినీ నటుడు అజిత్ కుమార్ తల్లి మోహిని మణి (85) చెన్నైలో క‌న్నుమూసిన విష‌యం తెలిసిందే. ఈ నేపథ్యంలో తమిళనాడు ముఖ్యమంత్రి, తమిళగ వెట్రి కళగం అధినేత, నటుడు విజ‌య్‌తో పాటు న‌టి త్రిష కృష్ణ‌న్ శనివారం అర్ధరాత్రి సమయంలో అజిత్ నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు.

P

Entertainment | Published On May 31, 2026, 11.30 am IST

Actor Ajith | అజిత్‌ను ప‌రామ‌ర్శించిన సీఎం విజ‌య్‌, త్రిష‌
Advertisement

Actor Ajith | తమిళ సినీ నటుడు అజిత్ కుమార్ తల్లి మోహిని మణి (85) చెన్నైలో క‌న్నుమూసిన విష‌యం తెలిసిందే. ఈ నేపథ్యంలో తమిళనాడు ముఖ్యమంత్రి, తమిళగ వెట్రి కళగం అధినేత, నటుడు విజ‌య్‌తో పాటు న‌టి త్రిష కృష్ణ‌న్ శనివారం అర్ధరాత్రి సమయంలో అజిత్ నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోల్లో విజయ్ భారీ భద్రతా ఏర్పాట్ల మధ్య అజిత్ ఇంటికి చేరుకున్నట్లు కనిపించింది. ఇంటి వద్ద అజిత్‌ను ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్న విజయ్, అనంతరం లోపలికి వెళ్లి కుటుంబ సభ్యులను ఓదార్చారు. నటి త్రిష సైతం బ్లాక్ సల్వార్ సూట్‌లో అజిత్ నివాసానికి చేరుకుని మోహినికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అజిత్‌ను కలుసుకుని ధైర్యం చెప్పిన దృశ్యాలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి. ఇటీవ‌ల కాలంలో విజయ్, త్రిషల రిలేష‌న్‌పై ప‌లు ఊహాగానాలు వినిపిస్తున్న నేప‌థ్యంలో ఇద్దరూ ఒకేసారి అజిత్ ఇంటికి వెళ్లడం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

అజిత్ తల్లి మోహిని మణి గత కొంతకాలంగా వయోభారంతో ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. శనివారం ఉదయం నిద్రలోనే ఆమె ప్రశాంతంగా తుదిశ్వాస విడిచినట్లు వెల్లడించారు. దాదాపు మూడేళ్ల కింద ఆమె భర్త పీ సుబ్రమణ్యం మరణించగా.. తాజాగా ఆమె సైతం కన్నుమూయడం కుటుంబాన్ని తీవ్ర విషాదంలో ముంచింది. తల్లి మరణ వార్త తెలిసిన వెంటనే దుబాయ్‌లో ఉన్న అజిత్ కుమార్ హుటాహుటిన చెన్నై చేరుకున్నారు. మోహిని మణి మృతిపై అజిత్ కుటుంబం విడుదల చేసిన ప్రకటనలో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. త‌మ కుటుంబానికి ఆమె మా కుటుంబానికి గుండెకాయ లాంటివార‌ని, అపారమైన ప్రేమ, సహనం, జ్ఞానం, ఆత్మస్థైర్యానికి ప్రతీకగా నిలిచార‌ని, ఆమె మాకు నేర్పిన విలువలు జీవితాంతం మార్గదర్శకంగా నిలుస్తాయ‌ని కుటుంబం పేర్కొంది. సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు సంతాపం ప్ర‌క‌టించి, అజిత్ కుటుంబానికి సానుభూతి ప్ర‌క‌టించారు. ఆదివారం ఆమె అంత్య‌క్రియ‌లు జ‌రుగ‌నున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by Tvkvijay Family (@tvkvijay.family)

Advertisement
Advertisement