త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Rajinikanth | పారిశుద్ధ్య కార్మికురాలి నిజాయితీకి ర‌జ‌నీకాంత్ ఫిదా – బంగారు గొలుసును బ‌హుమ‌తిగా ఇచ్చిన సూప‌ర్ స్టార్‌

త‌న‌కు దొరికిన న‌ల‌భై ఐదు తులాల బంగారాన్ని పోలీసుల‌కు అప్ప‌గించి నిజాయితీ చాటుకున్న ప‌ద్మ అనే పారిశుద్ధ్య కార్మికురాలి నిజాయితీకి ర‌జ‌నీకాంత్ ఫిదా అయ్యారు. ఆమెను స‌త్క‌రించ‌డ‌మే కాకుండా ఓ బంగారు గొలుసును బ‌హుమ‌తిగా అంద‌జేశారు.

N

Entertainment | Published On Feb 3, 2026, 4.45 pm IST

Rajinikanth | పారిశుద్ధ్య కార్మికురాలి నిజాయితీకి ర‌జ‌నీకాంత్ ఫిదా – బంగారు గొలుసును బ‌హుమ‌తిగా ఇచ్చిన సూప‌ర్ స్టార్‌
Advertisement

Rajinikanth | ఓ పారిశుద్ధ్య కార్మికురాలి నిజాయితీకి సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ ఫిదా అయ్యారు. ఆమెను త‌న ఇంటికి పిలిపించి స‌త్క‌రించ‌డ‌మే కాకుండా బంగారు గొలుసును బ‌హుమ‌తిగా అంద‌జేశారు. పద్మ అనే పారిశుద్ధ్య కార్మికురాలు చెన్నై మ‌హాన‌గ‌ర పాల‌క సంస్థ‌లో ప‌నిచేస్తోన్నారు. జ‌న‌వ‌రి 11న రోడ్డు శుభ్రం చేస్తుండ‌గా 45 తులాల‌ బంగారు సంచి దొరికింది. ఆ బంగారం విలువ ఇర‌వై ఐదు ల‌క్ష‌లపైనే ఉంటుంద‌ట‌. ఆ బంగారాన్ని పోలీసుల‌కు అప్ప‌గించి త‌న నిజాయితీని చాటుకుంది ప‌ద్మ‌. ఆమె మంచి మ‌న‌సుపై నెటిజ‌న్ల‌తో పాటు ప‌లువురు సినీ రాజ‌కీయ ప్ర‌ముఖులు ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు.

బంగారు గొలుసు బ‌హుమానం...

తాజాగా పారిశుద్ధ్య కార్మికురాలిగా ప‌నిచేస్తున్న ప‌ద్మ మంచిత‌నానికి ర‌జ‌నీకాంత్ ఫిదా అయ్యారు. ఆమెను త‌న ఇంటికి పిలిచి స్వ‌యంగా స‌త్క‌రించారు. ప‌ద్మ‌కు బంగారు గొలుసును కానుక‌గా ఇచ్చారు ర‌జ‌నీకాంత్‌. భ‌ర్త‌, పిల్ల‌ల‌తో క‌లిసి ర‌జ‌నీకాంత్‌ను క‌లిసింది ప‌ద్మ‌. ర‌జ‌నీకాంత్‌ను ప‌ద్మ క‌లిసిన ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోన్నాయి.
ప‌ద్మ‌కు ఇర‌వై ఐదు వేల న‌గ‌దు సాయాన్ని కూడా ర‌జ‌నీకాంత్ అందించిన‌ట్లు స‌మాచారం. ఆమె పిల్ల‌ల చ‌దువుకు కూడా స‌హ‌కారాన్ని అందిస్తాన‌ని సూప‌ర్‌స్టార్ హామీ ఇచ్చిన‌ట్లు చెబుతోన్నారు.
ప‌ద్మ‌కు ఇటీవ‌లే ల‌క్ష రూపాయ‌ల న‌గ‌దు బ‌హుమ‌తిని అందించారు త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి స్టాలిన్‌. పోస్ట‌ల్ శాఖ కూడా ప‌ద్మ‌ను గౌర‌విస్తూ ఆమె పేరుతో ప్ర‌త్యేకంగా ఓ పోస్ట‌ల్ స్టాంప్‌ను రిలీజ్ చేశారు.

Advertisement
Advertisement