త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Malayalam OTT | ఓటీటీలోకి వార‌ణాసి విల‌న్ మ‌ల‌యాళం మూవీ – క్లైమాక్స్ ట్విస్ట్ మైండ్‌బ్లాక్‌

పృథ్వీరాజ్ సుకుమార‌న్ హీరోగా న‌టించిన లేటేస్ట్ మ‌ల‌యాళం మూవీ ఐ నోబ‌డీ థియేట‌ర్ల‌లో డిజాస్ట‌ర్‌గా నిలిచింది. క్రైమ్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన ఈ మ‌ల‌యాళం సినిమా ఓటీటీ రిలీజ్ డేట్‌పై అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ వ‌చ్చింది. ఆగ‌స్ట్ 25 నుంచి జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కాబోతుంది.

N

Entertainment | Published On Aug 16, 2026, 6.51 pm IST

Malayalam OTT | ఓటీటీలోకి వార‌ణాసి విల‌న్ మ‌ల‌యాళం మూవీ – క్లైమాక్స్ ట్విస్ట్ మైండ్‌బ్లాక్‌
Advertisement

Malayalam OTT | మ‌హేష్‌బాబు(Mahesh babu), రాజ‌మౌళి కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతోన్న వార‌ణాసిలో మ‌ల‌యాళ న‌టుడు పృథ్వీరాజ్ సుకుమార‌న్ (Prithviraj Sukumaran)విల‌న్‌గా న‌టిస్తున్నాడు. ఈ టైమ్ ట్రావెల్ అడ్వెంచ‌ర్ సినిమాలో కుంభా అనే పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నాడు. ఇటీవ‌లే ఐ నోబ‌డీ అనే మ‌ల‌యాళ మూవీతో ప్రేక్ష‌కుల ముందుకొచ్చాడు పృథ్వీరాజ్ సుకుమార‌న్‌. యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన ఈ మూవీని పృథ్వీరాజ్ సుకుమార‌న్ భార్య సుప్రియా మీన‌న్ నిర్మించింది. నిష‌మ్‌ బ‌షీర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమాలో పార్వ‌తి తిరువోతు హీరోయిన్‌గా న‌టించింది.

డిజాస్ట‌ర్‌...

జూన్ ఫ‌స్ట్ వీక్‌లో థియేట‌ర్ల‌లో రిలీజైన ఈ మ‌ల‌యాళం మూవీ డిజాస్ట‌ర్‌గా నిలిచింది. తాజాగా ఐ నోబ‌డీ మూవీ రిలీజ్ డేట్‌పై అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ వ‌చ్చింది. ఆగ‌స్ట్ 25 నుంచి జియో హాట్‌స్టార్‌లో ఈ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ మూవీ స్ట్రీమింగ్ కాబోతుంది. మ‌ల‌యాళంతో పాటు తెలుగులోనూ రిలీజ్ అవుతోంది.

క్లైమాక్స్ ట్విస్ట్‌...

సోష‌ల్ మీడియా ప్ర‌భావం నేటి స‌మాజంపై ఎలా ఉంద‌నే మెసేజ్‌ను ఈ సినిమా ద్వారా ఇచ్చారు డైరెక్ట‌ర్‌. కాన్సెప్ట్ కొత్త‌గా ఉన్నా ట్విస్ట్‌లు, ట‌ర్న్‌ల‌తో ఆస‌క్తిగా చెప్ప‌డంలో ద‌ర్శ‌కుడు త‌డ‌బ‌డిపోయాడు. పృథ్వీరాజ్ సుకుమార‌న్‌, పార్వ‌తి యాక్టింగ్‌తో పాటు క్లైమాక్స్ ట్విస్ట్ మాత్రం ఆక‌ట్టుకున్నాయి.

దొంగ‌త‌నం ఆరోప‌ణ‌లు...

రాజీవ్ ఓ ప్ర‌భుత్వ ఉద్యోగి. భార్య మీరా, ఇద్ద‌రు కూతుళ్ల‌తో అత‌డి జీవితం సంతోషంగా సాగిపోతుంటుంది. ఓ బ్యాంకులోని ప‌దిహేడు కోట్ల డ‌బ్బును దోచుకున్న దొంగ‌లు రాజీవ్‌ను బందీగా తీసుకెళ‌తారు. దారిలో దొంగ‌లు ప్ర‌యాణిస్తున్న కారుకు యాక్సిడెంట్ అవుతుంది. అంద‌రూ చ‌నిపోతారు. రాజీవ్ మాత్రం క్షేమంగా బ‌య‌ట‌ప‌డ‌తాడు. దొంగ‌లు కొట్టేసిన డ‌బ్బు మిస్స‌వుతుంది. ఆ దొంగ‌త‌నం రాజీవ్ చేశాడ‌ని ఆరోప‌ణ‌లు వ‌స్తాయి. చివ‌ర‌కు భార్య‌, పిల్ల‌లు కూడా అత‌డిని అనుమానిస్తారు. ఆ దొంగ‌త‌నం నేరం నుంచి రాజీవ్ ఎలా బ‌య‌ట‌ప‌డ్డాడు? ఆ డ‌బ్బు ఎలా మిస్స‌య్యింది అన్న‌దే ఈ మూవీ క‌థ‌.

Advertisement

తాజావార్తలు

Advertisement